పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

వెలసె వైష్ణవమాత్రుఁడే విబుధకోటి
యాశ్రయింపంగ సద్భక్తి నాదరించె
సిరుల నల్లాడు చెన్నప్ప శ్రీకరపు
భావభావుకకీర్తిప్రపన్నమూర్తి.

17


క.

మాజనకుఁడు చెన్నప్ప ర
మాజనకగభీరతాసమగ్రత మించెన్
రాజోత్తములున్ వైష్ణవ
రాజోత్తములున్ నుతింపఁ బ్రజ్ఞాశక్తిన్.

18


ఉ.

అంబకు జోడు పంచవిశిఖాంబకు జోడు విదేహరాజ జా
తాంబకు జోడు సాయకశయాంబకు జోడు పతంగలోకరా
జాంబకు జోడు మజ్జననియై భువనంబుల మించినట్టి కృ
ష్ణాంబ గుణావలంబ విబుధావళి నేలు భళీ భళీ యనన్.

19


సీ.

లక్ష్మీసమాఖ్యయౌ లలనతో గృహమేధి
                       భావంబుచేఁ జాలఁ బ్రబలినాఁడఁ
గవితవైభవులు సింగన్న యనంతుండు
                       నాదిగాఁ బుత్రుల నందినాఁడ
శోభితాపస్తంబసూత్రపవిత్రకీ
                       ర్తిస్పూర్తిచేత వర్తిల్లినాఁడ
నఖిలవైష్ణవరహస్యార్థోపదేశంబు
                       లనుపమభక్తిమై నందినాఁడ


తే. గీ.

నందనందనపూజనానందవార్ధి
నోలలాడుచు సద్గోష్ఠి నున్నవాఁడ
నూరి మాన్యుండ నల్లాడు నారసింహ
నామకుఁడ సంతతగురుప్రణామకుండ.

20


సీ.

ఏదేశికాధీశుఁ డిద్దబుద్ధిస్ఫూర్తి
                       బ్రహ్మరాక్షసులశాపం బణంచె
నేదేశికోత్తముఁ డెదిరించి నిలిచిన
                       శక్తికి చక్రాంకశక్తి యొసఁగె
నేదేశికాధ్యక్షుఁ డేకశిలాపురి
                       నిజమతంబంతయు నిర్వహించె
నేదేశికశ్రేష్ఠుఁ డాదిమై రామాను
                       జాచార్య విజయధ్వజాంక మయ్యె