పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

45


ఆదిమూలం బైన యమృతంబుఁ ద్రచ్చుచో
             ఫణివిషజ్వాలకుఁ బాఱనేల
పదునాల్గుభువనంబు లుదరంబులో నున్నఁ
             బగతుఱచే బాధ పడఁగనేల
విశ్వమంతయుఁ దానె వేలుపై నెగడినఁ
             గొడుకుఁ జంపఁగఁ జూచి కొఱలనేల
తా నగ్రదైవమేఁ దనకర్మముుల వాయ
             శివప్రతిష్ఠలు పూని సేయనేల


యిట్టి వన్ని చదివి యిలఁ గమలాక్షుండె
దైవ మనుచు మిగులఁ దలఁచి తలఁచి
యభవు మఱచి కొంద ఱైహికాముష్మిక
భ్రష్టు లగు టదేమి బసవలింగ!

88


తగిలి వరాహావతారంబుఁ జెప్పుదు
            రది కార్తికేయుచే నణఁగె ననరు
నరసింహుఁ డుగ్రదానవుఁ జంపె నందురు
            మఱి శరభేశునిమహిమ వినరు
వ్యాసుండు చే యెత్తె నని పల్కుచుందురు
             కని నందికేశుండు తునిమె ననరు
ఘనుఁడు త్రివిక్రముఁ డనుమాటలే గాని
             వీఁపు పెళ్ళున శూలి విఱిచె ననరు


ఏమి చెప్ప భక్తిహీనపౌరాణికు
లైన దుష్టమానవాధములను
జూడరాదు వారిఁ జూడ దోషము భక్తి
పరుల నంటు మిగుల బసవలింగ!

89