చేపనవ్విన కథ
281
అప్పుడు గోపాలుఁడు. దమగురువుగారి యద్భుతశక్తికి మెచ్చుకొనుచు నా యడవిలో యతివేషముతో దిరుగుచున్న కామపాలుని సుగుణావతిని వెదకి యచ్చటికిఁ దీసికొనివచ్చెను. వారిరువురు నిజరూపము ధరించియున్న బుద్ధిసాగరునిం జూచి యానందపారావారంబున దేలుచు నతనిం గౌఁగలించి పెద్దయుంబ్రొద్దు మాటలు రాక కంఠంబును డగ్గుతికముజెందఁ గన్నుల నానందబాష్పములు గ్రమ్మ దృష్టుల నిరోధింప నేమియుంబలుకక యట్లేయుండిరి.
అంత కొంతసేపునకు నా మువ్వురు మణిసిద్ధుని గోపాలునిఁ బెక్కుగతుల స్తుతిజేసి వారి యనుమతివడసి తమదేశంబునకుఁబోయి తల్లిదండ్రుల కానందము గలుగఁజేసిరి.
పండ్రెండవ మజిలీ
చేపనవ్విన కథ
మణిసిద్ధుండును గోపాలునితోఁ బదిరెండవమజిలీ చేరి యందొకతోటలో నినుపచిక్కముల వ్రేలగట్టబడి స్త్రీలయాకారముతో నున్న కొందఱఁ బురుషులం గాంచి వారివృత్తాంత మెఱింగింపుమని యడిగిన నగ్గొల్లనికి నయ్యతిపుంగవుండు దన మణిమహిమచే నంతయుఁ దెలిసికొని యక్కథ నిట్లు సెప్పదొడంగెను.
గోపా! యీపురము కళింగదేశమునకు రాజధానియైన ధర్మాపురమని పిలువ బడుచున్నది. దీని సింహధ్వజుఁడనురాజు ప్రభుకీర్తియను మంత్రితోఁగూడి పాలించుచుండెను. ఒకనాఁడు గొందఱు పల్లెవాండ్రు తమకు దొరికిన యద్భుతమైన చేప నొకదాని జీవముతో నుండగానే పారితోషికమందు నాసతో నారాజునొద్దకుఁ దీసికొని పోయిరి.
ఆసింహధ్వజుఁడు వింతవస్తువులనిన మిగుల సంతసించును. దానిం జూచి వెఱగుపడచు గ్రామములోనున్న పెద్దమనుష్యులకుఁ మిత్రులకు సామంతులకు వార్త పంపి యా వింతచేపను జూపించెను. దానిం జూచిన వారెల్ల దమ జీవితకాలములో నటువంటి పెద్దచేపనుఁ జూడలేదని చెప్పదొడంగిరి. అట్లు దానినిఁ గొంతసేపుంచి యారాజు అంతఃపురంబునకు బంపి తన భార్యలకుఁగూడ నావేడుక జూపింప నిశ్చయించి యాపల్లెవాండ్రతో నోరీ! యిది యాఁడుదా? మగదా? యని యడిగెను.
ఆ రాజునకు మిగుల చక్కనివారును యౌవనము గలవారును భార్యలు