పుట:కాశీమజిలీకథలు -01.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రౌంచద్వీపముకథ

137

పిమ్మట నొకసింగ మ్మతిరయంబున బరతెంచి వీకమై తోకఁద్రిప్పుచు సటలు నిక్కబట్టి యాచెట్టుక్రింద గద్దియం బెట్టుకొని కూర్చుండెను. అంతకుమున్ను చెట్టుమీదఁ గ్రౌంచంబనుపక్షి పరుండియున్నది. సింహభీతిచే విక్రమసింహుఁడు నిదానింపక దాని రెక్కలను గూడ చెట్టుశాఖలే యనుకొను దట్టముగానున్న తత్పక్షంబుల మద్య దాగియుండెను.

ద్వీపాంతరమున వసించునదియు మిక్కిలి గొప్పదియు నగు నాపక్షి యప్పుడు కొంచెమలుకుడు తగిలినందున చెట్టుకొమ్మను విరుగ రివ్వున నెగసి గగనమార్గమునఁ గ్రౌంచద్వీపాభిముఖముగాఁ బోవజొచ్చెను.

అప్పుడపక్షి రెక్కలమధ్యను జిక్కు పడిన విక్రమసింహుడు భయపడి దాని రెక్కలపట్టు విడువక అయ్యో! మేమొక్కటి దలంచిన దైవమొక్కటి దలంచెనే? అక్కటా! నన్నీపక్షి యెక్కెడి కెత్తుకొనిపోవునో కదా! నాదినములు మంచివికావు. ఇంటియొద్దనుండి సుఖముగా రాజ్యముసేయక విదేశగమనబుద్ధి యేలపట్టవలయును మిత్రుఁడు ననుగానక యెంత చింతించునో యేమి సేయుదు? వాని కీవార్త యెట్లు తెలియునో యనేకప్రకారంబుల విలపించచు నొకచీటి వ్రాసి యది నేలంబడవైచెను

క్రౌంచద్వీపముకథ

ఆ పక్షియు నక్షీణజవంబున ననేకదేశంబులును ద్వీపంబులు దాటి క్రౌంచద్వీపమున నొకచెట్టుమీద వ్రాలెను. తరచుగ నాపక్షులా ద్వీపమున వసించి యెప్పుడైన జంబూద్వీపమునకుఁ మేతకై వచ్చుచుండును. దానంబట్టియే యాద్వీపమునకుఁ గ్రౌంచద్వీపమని పేరు వచ్చినది.

అట్లు వ్రాలినతోడనే విక్రమసింహుఁడు మెల్లన దానిరెక్కలసందునుండి తప్పించుకొని యామ్రానుకొమ్మ లాధారముగా భూమికి దిగెను. ఆ పక్షి యతఁడు తన రెక్కలలోఁ జిక్కుటయు దిగుటయు గూఁడ నెఱుఁగదు. దాని బలమెట్టిదో చింతింపుము.

అట్లు దిగి దైర్యమే తనకు సహాయమైయుండఁ గొండొకదెసగా నడువఁ జొచ్చెను. నడువనడువఁ గొంతసేపున కొకపట్టణప్రాంతము జేరునంత నొకనెలఁత యెదురైనది.

దానిం జూచినంత నతండు నివ్వెరపడి పలుదెరంగులఁ జింతించుచుండ నయ్యండజయానయు నంతికము కరుదెంచి యత్యంతసుకుమారుండు నారాజ