పుట:కాశీమజిలీకథలు-12.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

242

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

విమానమందున్న యామె ముఖంబును మాటిమాటికిఁ జూచుచు నిట్లని దలంపఁ సాగితిని.


గీ. అమలమగు నీలమణిఫనకమును బోలు
    గగనమున వెట్లు శశిబింబకమును గాంచి
    తలఁచితిని నావిమానమం దలరు చెలువ
    వికసితో జ్వలాస్యప్రతిబింబమనుచు.

గీ. ఇందుఁ డితఁడు లతాతన్విసుందరాస్య
    సంపలకోడి లోఁ గలుషంబు బూని
    వెన్నెలముసుంగుఁ దాల్చి ప్రచ్చన్నగతిని
    రాత్రులఁ జరించుచుండెఁ దాఁ ద్రపవహించి.

గీ. ముజ్జగంబుల నీరూపమునకు సాటి
    యైనమానిని లేదని యబ్జభవుఁడు
    వ్యోమభూమిని ఖటికతో నొరులరూప
    మునకు సున్నఁజుట్టినయట్లు దోఁచెను విధుండు.

ఆహా ! నిద్రచే నేత్రములు మూసికొనియున్నను నీమె ముఖసౌందర్య మెంత యొప్పిదంబుగ నున్నది ? అంతస్తాపంబునఁ జిపురు సెజ్జంగూడ దహించు చున్నను నీమె శరీరమెంత లావణ్యభూయిష్టమై యున్నది. శిశిరోపచారచందనజడీ కృతమునైనను నీమె యవయవముల కాంతి యెంత యద్భుతముగనున్నది ? అని యిట్లు ప్రశంసించుచు నామెయందే బుద్ధినిలిపి ముందు విమర్శింపకుండ నేను బోవు చుండ నీపర్వతశిఖరముపై గగనగంగాతటంబునఁ దపం బొనరించు నొక మహర్షి మీఁదుగా వానిశరీరము నొరసికొని నా విమాన మరిగినది.

అందులకుఁ గుపితుఁడై యా మునీంద్రుండు క్రూరదృష్టుల నాపై బఱపుచు నోరోరీ ! చపలుడా ! నీ చపలస్వభావమునకు దగినఫల మతిశీఘ్రముననే యనుభ వింతువుగాక. నీ యవివేకమువలనఁ గలిగిన పాపంబుమూలమునఁ జపలమర్కటమువై వనపశుత్వంబు నందుమని శపించి యెదుర విమానమందున్న నబల నీక్షించి సర్వ విదుండగు నతం డించుక ధ్యానించి సమస్తమును దెలిసికొని ససంభ్రమంబున నిట్లనియె. ఓరీ ! పాపాత్మా ! దుష్టబుద్ది స్త్రీరత్నము నపహరించుకొని పోవుచుంటివా ! ఈ రవిశృంగమను పర్వత మూలంబుననున్న కువలయామోదమను సరోవరప్రాంత కాంతారముననే యుండి యీమెను నీవే సంరక్షించుచుండుము. మఱియును మద్వచః ప్రభావంబున నాగిరిగర్భంబున మనోహరమగు మాణిక్యభవన

ము అని వచించి ఎలంము