పుట:కాశీమజిలీకథలు-12.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

విచిత్ర సమ్మేళనము కథ

239


గీ. సుందర సరోజకోమలం బందియున్న
    కరమిదేలను లాఁగికో గడఁగె దబల
    చిరతరాపేక్ష నోకిందు దొరకె దీని
    నెట్లు విడతునొ చెప్పుమా యిందువదన?

ఇంతలో నబ్దినీపలాశపుటంబున నీరుగొని యతివేగంబున నేతెంచు తారావళి దూరమునుండి యా రాజేంద్రు నీక్షించి యమందానందకందలితహృదయారవిందయై వారికలయిక కభినందించుచుఁ బెద్దయెలుంగన నోహో ! సమస్తజగదాజీవనైక కారణు లగు దేవర యేకాకియై యెచ్చటినుండి యెట్లిచ్చటి కెందుల కేతెంచితిరో యెఱుంగ గోరుచున్నావని సవిస్మయోద్ద్రేకంబునఁ బ్రశ్నించుచుఁ దాఁ దెచ్చిన నుదకంబు మంగళ ప్రదంబుగ వా రిరువురిమీఁద జిలికెను. రాజును ముదమందుచు విశ్వభూతి శిష్యురాలు తనసమీపమున కేతెంచినది మొదలు జరిగిన నిజవృత్తాంతమెల్ల నామెకు దెలియఁజేసెను.

341 వ మజిలీ

ఇంతలో నాకసమునుండి పడిన పిడుగు చప్పుడువలెఁగఠోరమై యసుర సంహారసంరంభకుపితయగు కాత్యాయనీదారుణహుంకారమువలె భయంకరమై, యక్ష వధప్రధావితుండగు పవననందనుండొనర్చు కిలకిలారావములవలె భాసురమై, శత్రువర్గము నురుమాడునప్పుడు బీముండొనర్చు సింహనాదంబువలె భీకరమై ప్రతిశబ్ది తాద్రికందర సరోవరమై, యాకులీభూతసకలజలసత్వమై, యుత్రాసితవనశకుంతమై యొప్పు భయంకర హుంకార మొనర్చుచు, బ్రహ్మాండమండలమున కెల్ల వణఁకు బుట్టించుచు, నుదంచితచపేటంబునస్థలంబును బ్రద్దలుగొట్టున ట్లుప్పుచు, దిక్కులనెల్ల లాంగూలవలయంబున నరికట్టుచున్నట్లుగనిపించుచు, రోషానలజ్వలితములగు చూపులచే బుడమిని భస్మమొనరించునట్లు దోఁచుచు, బండ్లు పటపటం గొఱుకుచు, భయంకర దర్శనుండై నిద్రనుండిలేచి, తారావళివలన నభినందింపబడుచు నుదయసుందరిని జేపట్టియున్న రాజపట్టిని దూరమునుండియేచూచి మహాక్రోధంబున నందుండి యొక గోలాంగూలుం డతిరయంబున నా రాజేంద్రునిమ్రోల కేతెంచి వాని భుజముమ బట్టి లాగఁదొడంగెను.

అప్పుడు భయకంపితయై యుదయసుందరి యిట్లని విచారించెను. అన్నా ! దురాత్ముండగు దైవమువలన నిహతురాల నైతినిగదా. మన్మధశరవ్యాఘాతమూర్చితనై యీ కోఁతి యిందున్న దనుమాట మఱచిపోయితిని. చిరకాలముల కిష్టజనులఁగలిసి కొనిన సంతోషరసమున మత్తతంజెంది యిందది నిద్రించుచుండుట యించుకయును సమ్మతింపనైతిని. అనురాగాంధకారమునఁ జిక్కికొని యిచ్చటి కేతెంచు నీ దుష్టవన భి రావ[ీ: ఇండేమి

దాజంగలమో సత్వర ఒహ 4 ఖరిపొలింపబడుచున్న