పుట:కాశీమజిలీకథలు-12.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

భూధరములందును, జాహ్నవీ రేవారి మహానదులందును, సర్వప్రదేశములందును, జలాశయములందును, నుచితరీతుల భూలోకమునఁ దిరుగు భుజంగభటులకుఁ గమల కంఠుఁడు నాయకుఁడై యుండవలెను.

జంబూద్వీపంబున కావలఁ గల మహాద్వీపము లారింటిలో శాకద్వీపంబున దుర్మదుండును, కుశద్వీపంబునఁ గాలాంజనుండును, గ్రౌంచద్వీపంబునఁ జక్రాహ్వ యుండును, శాల్మలీద్వీపంబున సరళుందును, గోమేదంబున నసీముఖుండును, బుష్క్ల రంబునఁ దాపిచ్చకుండును బరికింపవలెను. అందులవణసాగరము మొదలు స్వాదూరక సముద్ర పర్యంతము గలసప్తాంబుధులయందునగమేద్యదణుప్రభృతి సర్పశౌండీరు లెల్ల దిరుగవలెను. పిమ్మట హృదయవేగుండు నాయకుండుగా నెనమండ్రు కాకోదర భట శ్రేష్ఠు లష్టదిక్పాలుర నగరంబుల సంచరింపవలెను. పిదప స్వర్లోకమున కేఁగి త్రిదశుల రాజధానుల, సిద్ధుల నగరంబుల, విధ్యాధనుల పురంబుల, మిగిలిన దేవతా స్థానముల, బ్రహ్మలోకమువరకు మేరుపర్వతము జుట్టును, వెదకుచు, సప్తోర్ధ్వలోక ములు సంచరించవలెను. ఈ సేన కెల్ల నింద్రవీలుం డధిపతిగా నుండఁగలవాఁడు అని యిట్లు పురాణకమఠమునుండి బ్రహ్మలోక పర్యంతము గల బ్రహ్మాండగర్భ మెల్ల గాలించి యుదయసుందరి యెచ్చటనున్నదో తెలిసికొనవలెనని యా భుజంగ వీరులనెల్ల నుత్సాహపరచి యతిత్వరితగతి నాశిఖండతిలకుఁడు వారిఁ బంపివేసెను.

335 వ మజిలీ

నేను నుదయసుందరీవియోగదుఃఖమును భరించి స్వయముగా నామె ప్రవృత్తి నరయదలంచి యామెకెట్టిగతి గలిగెనో తెలిసికొని యట్టిగతినే పొంద నిశ్చ యించుకొని యిట్లని యాలోచించుకొంటిని. ఉదయసుందరి కెట్టిగతి గలిగెనో యెరుంగకుండ ముందు నే నేమి జేయగలను ? అమె యెవనిచేతనై న నపహరింపఁబడి యుండునను ననుమానమున నెచ్చటికి బోదును ! సీతాపహరణమువలన స్ఫుటప్రతీతు లగు రక్కసులు స్త్రీల నపహరించుటయందు సహజవ్యసనులుగదా ? అట్టిరక్కసు లకు నిలయమైన లంకాపురం బీసముద్రాంతర ద్వీపమునకు సమీపముననే కలదు. కావున ముందుగ నందు వెదకి పిదప మఱొక చోటికిం బోయెదంగాక. భాగ్యవశమున నాకచ్చటనే యామె గనుపించిన నాహృదయవాంఛిత మీడేరగలదు యువకులకు విరాళిగొల్పునిట్టి తరుణీరూపమున నేనందు బోయియింటింటికి దిరుగుచున్న యెడల నాకు గూడ హాని గలుగగలదు. కావుల భస్మ జటావల్క_లాదులచే గృత్రిమతాపసిత్వమును