పుట:కాశీమజిలీకథలు-12.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    క్రీడంతం ప్రేతరంకైః కుణపభువిహాజంగలగ్రాసలోభ
    భ్రామ్యద్బల్లూకఘూకప్రకరపరిగతం క్షేత్రపాలం నమామి.

పిమ్మట నమ్మండపమున నించుక విశ్రమించి విస్మయమున గనులు మూసికొని యిట్లు ధ్యానించితిని. ఔరా ! విధివిధాన మతి విచిత్రమైనదిగదా? అతి భయంకర మహారణ్యమధ్యమందు జిక్కి. జీవితాశ వదలుకొనిన నాకు రత్నజ్యోతిం జూపి యిందు జేర్చెను. కాకున్న నిట్టి గేఢాంధకారమున నియాయతన మేరీతి గోచర మగునని తలంచుచు గనులు దెరచి చూచినంత మణికింకిణీరణత్కారముతో నంబరము నుండి దిగుచున్నవాడును, కటికిచీకటిలోగూడ దన్నావరించియున్న నిజతనూద్యుతిచే విస్పష్టముగ గనపడువాడును, చరణసూపురధ్వని విని వెన్నంటివచ్చు గగనగంగా మరాళ బాలకశ్రేణివలె ధవళనరకరోటిమాలిక నుత్తరీయముగా ధరించు వాడును, భస్మావలేపనమున పితాచ్చధూళిధూసరితమగు మోక్షమార్గమున జరించు బాటసారివలె నొప్పువాడును, నస్థి మణిభూషణభూషితుండై గగననగరమునం గల తారకధనమెల్ల నపహరించుకొని వచ్చు దొంగవలె నెన్నదగినవాడును, వామకరమున శుక్లకపాలశుక్తికం దాల్చి శశిబింబార్థమును సంపూర్ణముగ జేయ దానిని జేత బట్టికొనిన విధాతవలె నొప్పువాడును, పూదండవలె నల్పాస్థికర్ప రకములచే జుట్టబడిన జటాకలాపము దాల్చినవాడును నగు కాపాలికుం డొకండు నాకు గనంబడెను.

అట్లు పుడమికి దిగి యాకాపాలికుండు తొలుత నతిభక్తి నా దేవి కభి వందనం బొనర్చి పిమ్మట నన్గాంచి విస్మితుండై నా సమక్షమున కేతెంచెను. నేనును లేచి వానికి నమస్కరింప బ్రీతుడై మదఁతికమున గూర్చుండి వత్సా ! దురతి క్రమా పాయబహుళంబగు నీ మహారణ్యమధ్యమున నెటు జిక్కుకొంటిని? ఎచ్చటినుండి వచ్చి తివి? నీ కిందేమి నిమిత్తము గలదని సంభ్రమమున బ్రశ్నించు వాని సన్నిధిని నిజము మరుగుపరుపజాలక యధార్థ మెల్ల జెప్పి నా పూన్కెకు దగు సహాయము జేయుమని ప్రార్దించితిని. నా వృత్తాంతము సాంతముగ విని యామునిముఖ్యుండు శిరఃకంపం బొనరించచు నిమేషమాత్ర మేకాగ్రచిత్తుడై నావంక దిలకించి తోడనే పర్యంక బంధమున సుస్థిరుడై యాకసమువంక జూపు నిగుడించెను. తోడనే తళతళ మెఱయు గౌక్షేయకమెచ్చటనుండియో వచ్చి వాని మ్రోలబడెను. దానిం గైకొని యతడు మందహాస మొనరించుచు వత్సా ! ఈ కృపాణమును గైకొనుము. నీపూన్కె కిది సన్నిధినుండిన నెంత పనినైన సాధింపగలవు. ఇయ్యది దివ్యప్రభావము గలది. దీనిం జేపట్టి యున్నవానిని దేవదానవులైన నిర్జింపజాలరు. దీనివలన నీయభీప్సిత మీడేరగలదు. కావున నతిజాగరూకుడవై కాపాడుకొనుచుండుమని చెప్పి నన్నాశీర్వ దించి యాకత్తినిచ్చి యాకాపాలికుండు వియద్గమనమున నెచ్చటికో పోయెను.

తత్కృపాణలాభమునకు మనమున నత్యంతసంతోషమును బొందుచు నప్పటికే రాత్రి చాలగతించుటచే నించుక విశ్రమింపనెంచి యాదేవీభవనములోనికిం