పుట:కాశీమజిలీకథలు-12.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యున్నను నాసన్న కుసుమమంజరుల ఝంకారమొనర్చు తుమ్మెదలును పక్వఫలముల మెసపుచు గలకలముసేయు శుకాదిశకుని సంతానములును, సహకారశాఖాగ్రముల నుండి కుహూకారమొనర్చు పికసంతతులును, తమాలషండములనెక్కి కేకారవమొనర్చు మయూరవారములును, దీర్ఘికాపులినముల గోలాహలం బొనర్చు మరాళకులములును దుర్నివారములై యేలినవారి మనమునకు సావధానమును బోఁగొట్టగలవని వచింప నమ్మహీపతి వల్లెయని సత్వరమ లేచెను. తత్కధాశ్రవణ కౌతుకభరమున నడచువాని కైదారడుగులదూరములోనున్న నమ్మణి మండపము గవ్యూతిరతాయితంబై గన్పట్ట నెట్టెట్టులో నాయుర్వీపతి మణిమండపముం జేరి యందు విమలమణి మయాసనమున సుఖోపవిష్టు డయ్యెను.


330 వ మజిలీ

కుమారకేసరికథ

అట్లుపవిష్టుండై వినోదకథ శ్రవణమునకై సావధానమనస్కుడై యున్న యన్నరేంద్రుని యభిప్రాయ మెరిగి వసంతశీలుఁడు తొందరబెట్ట శుకశరీరము విడిచి వచ్చిన యానూతన పురుషు డిట్లని చెప్పదొడంగెను.

దేవా ! అవధరింపుము. భువనంబులబ్రసిద్ధమగు మర్త్యలోకకీర్తివలె వివిధసౌధ సుధాదవళయై, జంబూద్వీప జయశ్రీవిధమున నున్న తాయతనధ్వజవిరాజమానయై, భారతవర్ష సౌభాగ్యములీలమాణిక్యమందిర ప్రశోభితయై, యుత్తరాపథ ప్రవృత్తికరణి ప్రభూతారామ రమణీయయై, భూచక్రమును జుట్టియున్న మహార్ణవముయొక్క రూపాంతరమువిధమున గభీరజలదుర్గమపరిఖావృత పరిసరయై, మిన్నునొరయుటచే జారివడియున్న రవిరధతురగతుండడిండీర పిండములబోలు చంద్ర కాంతకపిశీర్షము లతో వెలయు మరకత శిలానిర్మాణ ప్రాకారయై, సిరులకు నెలవగు ననేకచిత్రశాల కాకరమై, పరిశుద్ధవర్తనులగు పురజనుల కావాసయోగ్యమై, ముల్లోకములకు నగయై పొగడ్త కెక్కిన మధురయను పట్టణశ్రేష్ట మొకటి కలదు.

అం దుపేంద్రవిదళితుం డగు పంసదానవుని యంతఃపురపురంధ్రుల కాటుకకన్నీటిధారలచే నిండిదోన యన నల్లనైన ప్రవాహజలముగలిగి వసుంధరారమణి భ్రూపల్లరివలె, నుదగ్దిశాసీమంతిని మరకతరత్నహారమువలె, కళిందవీరుని కృపాణ పట్టికవలెను, పూర్వార్ణవకుంజరము చరణశృంఖములవలె, నలరారుచు కైటభారాతి భయమున లోన నడగియున్న కాళియభుజంగుని జీర్ణనిర్మోకదళ ఖండములవలెనొప్పు డిండీరశకలములు దీరమునగలిగి విమలజలకేళీరసప్రసక్త‌ గోపీగణాభ్యంతరవిహారి