పుట:కాశీమజిలీకథలు-12.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


329 వ మజిలీ

చిత్రపటము కథ

దేవా ! ఇయ్యది మనసైన్యాధిపతి యగు పాంచాలసింహుని ధ్యానపటము. ఆతండు దేవపూజసమయమున నేలినవానియాకృతి నెదుర బెట్టుకొని యర్చించు చుండును. వెనుక నతండు దిగ్విజయార్ధ మరిగినప్పుడు భూమండలం బెల్ల జయించి ద్వీపాంతరముల నున్న రాజ్యములగూడ‌ స్వాధీనము జేసికొన సంబోధిమార్గమున నోడలమీద బయనము జేయుచు సముద్రమధ్యమున ధౌతిసితసైకతముల నతిరమ ణీయంబగు నొక యంతర్ద్వీపమున దిగి యచ్చట బౌర్వాహ్నిక కర్మముల నిర్వర్తించు కొని కొంత సేపు విశ్రమించెను.

ఇంతలో ననుకూలమగు గాలి వీచుటంజేసి ప్రయాణమునకు నావికులు తొందర పెట్ట సత్వరమ యందుండి బయలుదేరి యోడనెక్కెను. ఆ తొందరలో దేవ పూజోపకరణముల కధికారియైన విప్రుం డీ చిత్రపటము నయ్యంతర్ద్వీపమున మరచి వచ్చెను. వారెక్కిన ప్రవహణం బప్పుడు‌ నిముసములో ననేకయోజనము లేగువేగమున బోవుచుండుటచేతను, తాము విడిసిన ప్రదేశమున సముద్రమధ్యమున దెలిసికొనుట దుష్కరమని తలంచి యాచిత్రపటమునకై వారు ప్రయత్నింపలేదని యూరకుండెను.

ఆ పలుకుల నాలించి పుండరీకుడు తల పంకించుచు నాచిత్రఫలకమందు మరొకప్రతిరూప ముండుట యెఱింగి యతి కతూహలమున విమర్శింప నందొక స్త్రీ రూపముగూడ గోచరమయ్యెను. సృష్టికర్త నిర్మాణనైపుణ్యము నధిక్షేపించురీతి మనో భవుని పరిజ్ఞానతటినివలె శృంగారవీరుని రణవ్యూహకల్పనములాగున, త్రిభువన సీమంతనీరూప‌ సర్వస్వపహరణం బొనరించి యుశ్వాసనిశ్వాస శబ్దములులేక దాగి యున్న తస్కరీవిధమున నావృతపటావస్థితయై. హరలలాటలోచ నానలభయమున బారివచ్చి యడగియున్న యసమ శరీరసౌందర్య లక్ష్మివోలె నతి మనోహరాకారయై, శక్రశాపోపహతయగు నూర్వశీరమణివలె జిత్రాకృతియై, దేవీస్వరూపమువలె ననిమిష లోచనయై తపోనిష్టనున్న గౌరివలె ననావిలయై, మదనదాహమూర్చితయగు రతీదేవివలె నిశ్చలాంగలతాదయవయై, పరమేష్టిసృష్టి వద్యవలె ననేక వర్ణప్రశోభితయై చిత్రగతయై యొప్పు నాయొప్పులకుప్పరూప మీక్షించి సహర్షుడై యారాజేంద్రుం డిట్లని తలంచెను. ఆహా ! ఏమి యీ సౌందర్యస్వరూపము !


చ. అమలవిలాసలోక విజయధ్యజభూషణ చిహ్నమై నవా
     సమ సమవర్ణదీప్తమయి, సాధువధూజనరూపగర్వ సం