పుట:కాశీమజిలీకథలు-12.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని కథ

143

మహారాజున కర్పించిన నుత్తమముగా నుండునని దలంచుచు చూచుచుండగనే య వ్విహంగ మా చైత్య శిఖరముననుండి కింద వ్రాలి యందలి మూలమణిపీఠ కుట్టి మమున నిటునటు తిరుగాడ దొడంగెను. అప్పుడు నేను దానిని పట్టుకొనగలుగుదునను నాసతో నవనమితగాత్రుండై యలక్షితపదప్రచారుడనై దాని సన్నిధికేగి చేతితో పట్టు కొన నుంకించినంత నాకు చిక్కక పైకెగిరిపోయి కొంతదూరమందున్న యొక వట వృక్షశాఖపై వ్రాలెను. ఆ యద్భుత శకుంతలము నెట్లయినను పట్టుకొని మహారాజున కర్పించుటకు కృతనిశ్చయుడనై నేను దాని వెంటాడుచు నా పక్షితో నొక చెట్టునుండి మరొక చెట్టునకు తిరుగుచుంటిని. అదియును నొకచో భూమికి దిగుచు నేను సమీ పించిన వేంటనే పై కెగయుచు నిముసమాత్రమాగుచు మరియొకచో నేలపై వ్రాలి వెంటనే పైకెగురచు నింకొకచో చేతికి చిక్కినట్లె యుండి పారిపోవుచు నిట్లా దిన మంతయు గడ పెను. నేనును మార్గామార్గము లెరుంగక దానివెంట బరువెత్తుచుంటిని. ఇట్లు క్రమక్రమమున నన్నా శకుంతము దురంతారణ్యమధ్యమునకు గొనిపోయి వన తరుశిఖర శాఖాశతాంతరమున నదృశ్యమైనది.


324 వ మజిలీ

పామరునికథ

అప్పుడు నేను దానికొఱకై విచారించుచు నందందు వెదుకఁజొచ్చితిని. అందుఁ గనంబడిన యరుణకుసుమకళితంగని యా చిలుక చంచువని భ్రమజెందుచు, హరితఫలగుళికంగాంచి దానిమౌళియని దలంచుచు, ప్రచలిత వినీలతరుదళములఁజూచి దాని పక్షకాండములని మోసపడుచు, వికటార్క ఫలకోశము దిలకించి దాని యంగ యష్టియని సంశయించుచు, పై నెగురుచున్న యన్యశకునిపక్షపుటపుటారావము విని యా చిలుకయే యెగురుచున్నదని శంకించుచు యావిపినముంతయు బరిభ్రమించితిని. పిదప నావిపినాంతమును ఖండితాశుఁడనై చేరి చేయునది‌ లేక విచారించుచున్న సమ యమున సమీపమున నవిరళతరుసరళ కాంతారమునుండి యనేక విహంగారవకోలా హలము వినిపించెను. అంతట నాశుకము లభించునను నాశ మనమునఁ దిరుగఁజనింప యాపక్షుల పిండున్నదశ కేగితిని. అందు ముందతినిర్మల జలప్రవాహ ప్రశోభితంబై యుష్టాంశుని తనయయని వినుతి కెక్కిన తాపియను నదిద్వరము నేత్రపర్వం బొన రంచెను.


గీ. ఆమహాధునీముఖ్య ముష్ణాంశునాత్మ
    జాతయైయున్నఁగాని తజ్జలము మిగుల