పుట:కాశీమజిలీకథలు-12.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము



గీ.‌ అట్టిసూనుండుబుట్టు భాగ్యంబు నాకు
    గలుగదయ్యెను నాతపఃఫలమదెల్ల
    దారుమారయ్యె నాడుసంతానమబ్బ
    వంశమెటునిల్చు మీదఁ దాపసవరేణ్య!

అని వ్యసనపడు చిత్రరధు నూఱడించుచు నారదుం డిట్లనియె. గంధర్వ కులచూడామణీ! విధినతిక్రమింపజాలువా రెందును లేరుగదా? పరమేశ్వరుని యాదేశము గూడ వారివారి పురాకృతము ననుసరించియే యుండును. నీకొక్కపుత్రికయును హంసుని కొక్క పుత్రికయును గలుగగలరని పలికిన సర్వేశ్వరునిమాటల కన్యధాత్వ మెట్లుండును ? దీనికై యెంత వంతపడినను ప్రయోజనములేదు. పరమేశ్వరప్రసాద సంలబ్ధమగు పుత్రికలను సామాన్యబుద్ధి దలంపరాదు. ఆపుత్రికాద్వయము మూలమున మీయుభయగంధర్వకులములకును శాశ్వతసదృశ్యంబు గలుగగలదు. వారికిపుట్టు పుత్ర సంతానమే గంధర్వరాజ్యరమా పరిష్వంగసౌఖ్యార్హ మై మీకత్యుత్తమ లోకసంప్రాప్తికి కారణమగును. తపమున బరమేశ్వరుని సన్నిహితుంజేసికొనగల్గిన నీభాగ్యదేయము మిగులస్తోత్రపాత్ర మైనది. ఇక మనమున నే విచారమును బెట్టికొనక నిజసదసమునకు బోయి సుఖమున‌ గాలము గడుపుచుండుము, నీచే నిచ్చట బ్రతిష్టింపబడిన నీశ్వరునకు నిత్యమును బూజావిధానములు జరుగుచుండునట్లుచూడుము. దాన నీకుత్తమలోకప్రాప్తి గలుగగలదు. పొమ్ము. శుభంబులం బడయుమని దీవించి యా దేవమునీంద్రుండు యధేచ్చాగతిం బోయెను. చిత్రరధుండు వానిమాటలవలన గలంకముడిగి నిజనివాసము నకుబోయి యా వృత్తాంతమెల్ల నాప్తుల కెఱింగించి సంతోషమున గాలము బుచ్భు చుండెను. నిత్యమును‌ బుడమి కేతెంచి యందు దనచే బ్రతిష్టింపబడిన సదాశివమూర్తిని స్వయముగా నర్చించుచుండెను.

322 వ మజిలీ

శ్రీవైకుంఠమందు గార్తికశుద్ధఏకాదశినాడు గొప్ప యుత్సవము బ్రతివత్స రము జరుగుచుండును. నాడు శ్రీమన్నారాయణుండు పాలసంద్రమునుండి యోగ నిద్రాప్రబోధితుండై లేచివచ్చి సర్వప్రపంచ సంరక్షంబునకు గడంగును. అప్పుడు దేవతలెల్లరునువచ్చి యా యాదినాయణ దివ్యదర్శనంబొనర్చి స్తోత్రపాఠము లొన రించుచుందురు. సురపురోహితుండగు బృహస్పతి సర్వబృందారక సమక్షమందాయధో క్షజుని లక్ష్మీసమేతముగా దివ్యసింహాసనమునందు గూర్చుండబెట్టి యాగమవిధుల వివిధసత్కారము లొనరించుచుండును. దేవర్షిబృందమెల్ల నాసభాభ్యంతరమున లక్ష్మీ నారాయణ ప్రీతికరముగ నాశిషంబుల బఠించుచుండును. తుంబురునారదులా దేవదేవుని వింశత్యవతార విశేషముల దివ్యగానం బొనర్తురు. అప్సరోయువతులా సభాప్రాంగ