పుట:కాశీమజిలీకథలు-12.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

123

అయ్యగారూ ! కాశీక్షేత్ర ప్రభావంబు వినుటచే నా మనంబున నధికోత్సా హము బుట్టుచున్నది. మీ యనుగ్రహమున నట్టి యుత్తమ తీర్థగమనలాభము నాకు చేకూరుచున్నది. నే నెంతేని ధన్యుండనని పలుకుచుండ నమ్మణిసిద్దుండు నేటికి జాల ప్రొద్దు బోయినది. ముందు మజిలీ యించుక దూరముగా నున్నదందురు. వేగమె బయలుదేరి యందు జేరవలయునని వానిని తొందరబెట్టి యప్పుడే బయలుదేరి యగ్గో పాలుండు గావడి యెత్తుకొని వెంటరా దదనంతరావసధమునకు బోయెను.

శ్రీరస్తు

కాశీమజిలీకథలు

పుండరీకుని జన్మవృత్తాంతము కథ

321 వ మజిలీ


శ్రీకాశీవిశ్వేశ్వర !
ప్రాకటబ్రహ్మాచ్యుతస్తుతాద్భుతమహిమా
ప్తోక ! శశికళాధర ! గౌ
రీకన్యాహృదయపుండరీకనివాసా !

దేవా! అవథరింపుము. అట్లు మణిసిద్దుండు శిష్యునితో దదనంతరావ సధముజేరి భోజనాంతరమున నుచితస్థలమున సుఖోపవిష్టుడైయున్న సమయమున నగ్గోపాలుండు వానిసన్నిధిం గూర్ఫుండి‌ వినయమున నిట్లనియె.


గీ. ఇచటఁ జేరినదాది మీరింతవఱకు
    నాకుఁజెప్పిన కథలెల్ల నాకలింపుఁ
    జేసికొనుచుండఁ దోచె నాచిత్తమునకు
    శంకలొకదానియందు విస్తారముగను.

సీ. కాదంబరీమహాగాధ గాధాంతరం
          బునఁ బుండరీకుఁ డన్మునితనూజు
    డమ్మహాశ్వేతకై యుమ్మలించుచు జీవ
          ముల బాయఁ జంద్రుఁడమ్మూ ర్తి నాత్మ