పుట:హరివంశము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

హరివంశము


ఆ.

పుత్రులార యింకఁ బొండు విజ్ఞానుల, రైతి రనుచుఁ దమ్ము నాత్మసుతులు
పలుకుటయు నిలింపు లలఘుసంతాపంబు, గదురఁ జనిరి బ్రహ్మకడకు మగుడ.

101


వ.

చని తద్వాక్యంబులు విన్నవించిన విని విరించి నవ్వుచు నది యట్టివవారలు
ప్రజ్ఞాప్రదాతలు గావునఁ దండ్రులై మిమ్ముఁ బుత్రుల రని పలికిరి శరీరకకర్తల
గుటం జేసి మీయందును బితృత్వంబు సిద్ధంబ యి ట్లన్యోన్యసంభావితులై మీ
రిరుదెఱంగులవారును దేవతలును బితరులు నై త్రైలోక్యసంభావితుల రగుఁ
డనినం గ్రమ్మఱ వచ్చి సురలు సురజ్యేష్ఠువలన సంశయచ్చేదం బైనవిధంబు
కొడుకులకుం జెప్పి.

102


క.

పితృభావము మీ కిట్ల, ప్రతిహతమై చెల్లె నింకఁ బ్రఖ్యాతులరై
సతతంబును సకలసమ, ర్చితుల రగుడు మముఁ బురస్కరించి ముదమునన్.

103


వ.

పితృసమారాధనతత్పరు లగువారికిఁ బుత్రపౌత్రధనధాన్యాదు లగునైహికవిభ
వంబులు నక్షయంబు లగు నాముష్మికసుఖంబులును సిద్ధించు నస్మదాప్యాయ
నంబు సోమునకు నాప్యాయనం బగు ననుండు సచరాచరం బగులోకంబున కాప్యా
యనం బొనర్చు నని పలికి రిది పితృగణంబునకుం గలిగిన యాదిసర్గంబును
దత్పూజాఫలంబును జెప్పిన విని మార్కండేయుండు మహాత్మా పితరు లెన్ని గణం
బులై వర్తిల్లుదు రేలోకంబున నుండుదు రానతీవే యనిన సనత్కుమారుం
డిట్లనియె.

104


తే.

ఏడుగణములై వెలుఁగుదు రెలమిఁ బితరు
లమరలోకంబునందు సంయమివరేణ్య
యందులో [1]సమూర్తులు నాలు గరయ మూర్తి
విరహితంబులు మూఁ డయ్యె విను గణములు.

105


సీ.

ఘనుఁడు విరాజునాఁ జనుప్రజాపతి తనూభవులు నై రాజులన్ పరమసంజ్ఞఁ
బరఁగెడుపితరులు భవ్యు లమూర్తులు మూఁడుగణంబులు మోదమాను
లగుచు సనాతనం బగులోకమునఁ జరింతురు వారి మానసోద్భూత యొక్క
కన్నియ మేనాఖ్య గలిగి నీహారశైలేంద్రునిభార్యయై యిష్టలీల


తే.

సుతుల మైనాకుఁ డనఁగఁ గ్రౌంచుం డనఁగఁ, బడసి నిద్దఱ మఱియు నపర్ణ యేక
పర్ణ యేకపాటల యనుపడఁతుకలను, గనియె నమ్మువ్వురును దపంబునకుఁ దొడఁగి.

106


వ.

స్థావరజంగమాత్మకం బగుజగంబులంతటికి భరం బగువ్రతభారంబుఁ బూని
రం దేకపర్ణ యొక్కవటపర్ణంబును నేకపాటల యొక్కపాటల[2]దళంబును దమకు
నాహారంబుగాఁ గొనుచు నదియు నొక్కసహస్రవర్షంబులు నిండిన నొక్కమాఱు
నియతంబుగాఁ జేసి పదివేలసంవత్సరంబులు నడప నపర్ణ యెయ్యదియు నొల్లక
నిరాహారయై యుండె నవ్విధంబునకుఁ దల్లి సస్నేహదుఃఖాకులయై యుమా యని

  1. మూర్తములు
  2. పుష్పంబును