ఉత్తరభాగము - ఆ. 6.
387
మ. ప్రగుణోత్సాహులు యాదవో_త్తములకుం బ్రత్యర్థులై తొల్లి యే
మగ[1]లున్ మైమయిఁ బో రొనర్చిరె వృథా మానాకులుం డైనయీ
పగతుం డెంతటివాఁడు వ్రేల్మిడిన యే భంజించెదన్ వీని మీ
రు గరిష్ఠస్థితి నన్నుఁ జూడుఁడు రణారూఢి న్వినోదింపఁగన్.143
క. మఱచితిరే యదువిభుఁ డిం, దఱకును బురి యొప్పగించి తగ నేఁగుట యి
త్తఱి నది శూరులు వోవఁగఁ, గొఱయగునే మగతనంబుం గులమును మనకున్.144
వ. అని పలుక నందఱు నుత్సాహంబునం బొదలి యవ్వీరుం గూడికొనిరి క్రమ్మఱం
గరదీపికాసహస్రంబులు బెలసె సనాథంబు లగుటంజెసి సైన్యంబులుం గలంక
దక్కి కడంగె రణతూర్యంబులరవంబును సుభటులయార్పుటెలుంగులు గజబృం
హితతురంగహేషితరవంబులు రథనేమినినాదంబులుం గలసి యొక్కటి యై
పెక్కటిల్లి దిక్కులు వగిల్చె నట్టియెడ.145
క. నలుదెసలఁ గోటఁ బ్రాఁకెడు, బలవంతులఁ బగఱఁ జూచి ప్రస్తుతబాహా
కలనంబు మాన్పుటకుఁ గ, ట్టలుక శినికులోద్వహుఁయు సనూహితమతి యై.146
క. అనిలాస్త్రంబు ప్రయోగిం, చిన నది [2]చొక్కాకు లట్ల చెల్లాచెదరై
చనఁ జేసెఁ బెలుచ శాత్రవ, జనులం బ్రాకార మస్త్రసంవృత మయ్యెన్.147
వ. అట్లు చెదరిన పౌండ్రసైనికు లందఱు నేలిక యున్నయెడకుం బోయిరి సాత్య
కియు సై న్యంబు దనతోడన చనుదేరఁ దఱిమికొని చని ప్రతిసేనయెదుర నిలిచి
యి ట్లనియె.148
సాత్యకి పౌండ్రవాసుదేవుని నెదిర్చి యాక్షేపించి యుద్ధంబుచేయుట
సీ. అక్కట రాజాన్వయమునందుఁ బ్రభవించి నీచుఁడై యేమియు రాచపాడి
యెఱుఁగక నడురేయి యెల్లజనంబులు సుప్తులైయుండఁగఁ జోరునట్లు
సనుదెంచె నెవ్వఁ డాతనిఁ గోరి వెదకెద నిదె దివియలు వట్టి యెచట నున్న
వాఁడు సూపుఁడు పౌండ్రవసుధేశుఁ గేశవబంట సాత్యకి యనుప్రకటబలుఁడ
తే. నాయితంబయి వచ్చితి నాలమునకుఁ, గార్ముకం బాదిగా నెల్లకైదువులను
శూరవరుల మెప్పించెద భూరిశక్తి, కలిమి దానును జూపంగ వలదె నాకు.149
క. తను మగిడి పోయివచ్చినఁ, దనయానయ రాజధర్మతత్పరుఁడై నా
సునిశితకరములచేం జ, చ్చిన మేలాప్తజను లింతసెప్పుఁ డతనికిన్.150
క. నావిని పౌండ్ర్రుఁడు నిజసై, న్యావలిముందటికి వచ్చి యతులధ్వజలీ
లావిర్భావము శరచా, పావష్టంభంబు మెఱయ నధికోద్ధతుఁ డై.151
వ. ఆతని నుపలక్షించి యి ట్లవియె.152
తే. ఓయి సత్యకాత్మజ నీవు యుద్ధమునకు, వచ్చినాఁడ వెక్కడ నున్నవాఁడు గృష్ణుఁ
డేరు విడిచి చిక్కులపారుటిదియ యతఁడుఁ, పసులఁ గావక యోధుఁడై పరఁగు టెట్లు.153