340
హరివంశము
జా. నీమాహాత్మ్యము నిక్కువం బెఱిఁగి వర్ణింపంగఁ బూర్ణోక్తియం
దే మెవ్వార మశక్తు లిప్పనికి వాగీశాదులు న్నిర్జర
క్షేమస్తోమ మొనర్చి ధర్మమున కుత్సేకంబుఁ గావించి తౌఁ
బ్రేమన్ ధన్యము సజ్జనప్రకర మన్వీతార్థముల్ లోకముల్.244
వ. భవత్ప్రసాదోప[1]జీవు లయినయస్మదాదులు త్రైలోక్యవిజయు లగుట సెప్పనేల
యని మఱియును బెక్కువిధంబులం గొనియాడుచున్నసమయంబున నారదుం
డరుగుదెంచి యదుసమాజంబుచేతం బూజితుండై పరమాసనంబున నుండి.245
నారదమహాముని శ్రీకృష్ణునిప్రభావము యాదవుల కెఱిఁగించుట
క. అంభోజాక్షుని కేలు క, రాంభోజమునం దెమల్చి యయ్యందఱితో
సంభోదనాదనిర్బర, గంభీరస్వర మెలర్పఁగా ని ట్లనియెన్.246
క. యాదవులార మహాభుజుఁ, డీదేవుం డిప్పు డెలమి నిలను గృతార్థ
ప్రాదుర్భావము నొందిన, యాదిపురుషుఁ డిట్టు లగుట నద్భుతభంగిన్.247
తే. ఇతనిమహిమ మీ కిందఱ కెఱుఁగునట్లు, గా సవిస్తర వ్యాఖ్యానకలన సేయ
నరుగుదెంచితి నేను నిర్జరవరేణ్యు, ప్రార్థనంబున సమ్మోదభరితబుద్ధి.248
వ. ఇమ్మహానుభావుండు బాల్యంబున నుండి యెయ్యవి యొనర్చె నింక నెయ్యవి
సేయ నున్నవాఁ డాసుకర్మంబు లన్నియుం గ్రమంబున వివరించెద వినుండు.249
సీ. ఉగ్రసేనాత్మజుఁ డుగ్రపరాక్రముఁ డాకంసుఁ డదయుఁడై యఖిలవృష్ణి
కులమును జీరికిఁ గొనక జరాసంధుప్రాపున నేపారి భవ్యరాజ్య
పదవైభవము దాన బలిమిమైఁ గొని తండ్రిఁ జఱవెట్టె నట్టిదుశ్శీలుఁ జంపఁ
బుట్టినవాఁడుగా బుద్ధిలోఁ గనుఁగొని వసుదేవుఁ డనఘుఁ డీవాసుదేవు
తే. మధురయుపవనంబున నొప్పుమహిత గోకు, లంబునం దుంచె నీతఁ డలంఘ్యతేజుఁ
డగుట యెన్నిభంగుల నపాయంబు నొంద, కిద్ధవహ్నియుఁబోలె నుదీర్ణుఁ డయ్యె.250
ఉ. చంట విషంబు మెత్తుకొని చంపుదు నర్భకు నంచు వచ్చి ము
వ్వంటులనాఁడ పూతన యవారణ నెత్తికొనంగఁ జన్నుఁబా
ల్గొంటయుఁ బ్రాణము ల్డిగిచికోలును నొక్కటి గాఁగ నీతఁ డా
గొంటునిశాచరి న్వసుధఁ గూల్చుట వింటిమ కాదె యేర్పడన్.251
క. ఇరుమూఁడునెలలశిశువై చరణకలనకేళిఁ గపటశకటముఁ దాఁచెం
బురుషోత్తముఁ డింతింతలు, మురియలుగా నిట్టిసత్వములు మహిఁ గలవే.252
మ. చనుమా చూతము నీతేజం బనుచు నుత్సాహంబుతోఁ దల్లి దా
మెనత్రాటన్ బెనుఱోలితో నడుము బల్మిం గట్టినం బాఱి సం
దున వేగంబ తగిల్చి యీడ్చి బలుమద్దుల్ రెండు నున్మూలనం
బును బొందించె మురాంతకుం డరిది యీ పొల్పొందుటల్ చెప్పఁగన్.253
- ↑ జీవను లైన; జీవకులైన.