ఉత్తరభాగము - ఆ. 4.
339
క. అత్తలకు మ్రొక్కి తక్కటి, [1]క్రొత్తడు లందఱకుఁ బ్రియము గొనలు నిగుడఁగా
నత్తఱిఁ దిలకించె వరవ, ధూత్తమ యై సత్యభామ యుజ్జ్వలగరిమన్.234
వ. తదనంతరంబ.235
సీ. బహుసంగరక్లేశభారసహిష్ణుఁ డై తనకుఁ దోడ్పడి సమ్మదం బొనర్చి
గొలిచినయాపక్షికులనాథు వీక్షించి వనజాక్షుఁ డాదరార్చనలఁ బ్రీతుఁ
గావించి చెలికానిఁగాఁగ నున్నించి పొమ్మని వీడుకోలుపంగ నమ్మహాత్ముఁ
డతిభక్తిఁ బ్రణమిల్లి ప్రాంజలియై దేవదేవేశ యెప్పుడు నీవిశుద్ధ
తే. బుద్ధి నాదెస నొలయ నద్భుతము గాఁగ, నప్పు డేతెంచువాఁడ నీయాజ్ఞఁ జేసి
యిది సునిశ్చత మని దివి కేఁగెఁ బక్ష, పవనధూతోర్ములై సరిత్పతులు గలఁగ.236
వ. ఇట నయ్యాదవేశ్వరుండు యదుకులం బఖిలంబు తనవిజయం బభినందింప సభా
మండపంబు ప్రవేశించి యుగ్రసేనవసుదేవుల నగ్రాసనంబుల నునిచి రోహిణీ
సహిత యగుదేవకీదేవి నభ్యర్ధించి యదితిం బూజించుబిడౌజుండునుబోలె
నొప్పి యప్పుణ్యశాలిని నంతఃపురంబునకుం బనిచి యగ్రజుండునుం దాను నంచి
తోజ్జ్వలపీఠంబుల నాసీనులై వృష్ణివీరు లుచితప్రదేశంబుల నుపవేశింపఁ గింకర
సమానీతంబు లగునిజభుజవిజితధనంబులు వేర్వేఱ యాలోకించి.237
క. కమనీయములును బహుమూ, ల్యములు ననర్ఘ్యములునైనయవి గురులకుఁ జు
ట్టములకుఁ జెలులకు నుచిత, క్రమ మొప్పంగ నిచ్చెఁ బ్రియము గడలుకొనంగన్.238
వ. విశేషించి సాందిపుని నధికార్చనంబులం దనిపి యుగ్రసేనకళత్రంబునకు నగ్రిమ
భూషాంబరాదు లిచ్చి పుచ్చి శేషించినయర్థంబులు భాండాగారంబుగా నునిచి
రథగజతురగాదులకు నధికారుల నియోగించి గ్రహనక్షత్రపరిపూరితయైన వియ
ద్వీథిం బొలుపారుపూర్ణచంద్రుచందంబున ననేకయదువీరపరికీర్ణ యగుసభకు
నొక్కరుండ యలంకారంబై మెఱసి యందఱఁ గలయం గనుంగొని యి ట్లనియె.239
చ. అనుపమపుణ్యకీర్తు లగునట్టి మహాతులు మీర లిందఱున్
గొనకొని నిర్వహించునవికుంఠితదానదయాదిసాధువ
ర్తనముల లావ చూవె సురదైత్యుల కైన నవధ్యుఁ డైనశ
త్రుని నడఁగించె నాదయినదోర్బల మె ట్లది యిట్టిసేఁతకున్.240
తే. పెద్దగాలంబు చెఱపడి పీడితాత్మ, లైనదివికన్నియలు ముక్తలైరి రత్న
శిఖరమును బారిజాతంబు చేరె నాత్మ, భాగ్యమై యవ్విధం బైన పనియలఁతియె?241
క. సొమ్మున కొడయలు మీ రా, జ్యమునకుం గర్త లీర యంచితకల్యా
ణములకుఁ బ్రవర్తకులరు, మి మ్మలరించుటయె యెల్లమేలును నాకున్.242
వ. అనినఁ గృతాంజలులై వార లద్దేవు నుపలక్షించి,243
- ↑ కొత్తరి యంతటికి; కొత్తటి యందఱికి.