పూర్వభాగము - ఆ. 8.
207
వ. అని యక్రూరుం డనేకక్రమంబులం జెప్పిన వాక్యంబుల యభిప్రాయం బంతయు
నెఱింగి కృష్ణుండు కంసవిధ్వంసంబునకు సముత్సుకుం డయెయే నందగోపాలాదులు
నారాజునకు నయ్యేఁటం బెట్టవలయు నప్పనంబులుఁ బాఁడియావులు నెనుములుఁ
బొగరుకోడెలు నజాతకప్రముఖంలుఁ గొని గోరసంబులు సాలం గూర్చుకొని
వేగుజాముగలుగం బయనంబయి కదలిరి తదనంతరంబ.160
తే. తీపు మిగులునక్రూరు నాలాపములకు, నుల్ల మపగతనిద్రమై యుల్లసిల్లె
నట్లు ప్రియమందుచున్న దైత్యాంతకునకు, నరిగె నవ్విభావరిముహూర్తాభ యగుచు.161
క. రజని తనుఁ బాసి పోవకుఁ, బ్రజనితభయతాపభరవిభాసితవైవ
ర్ణ్యజితాత్త్ముఁ డయ్యె నితఁ డన, రజనికరుఁడు దొరఁగె రుచిపరంపర యెల్లన్.162
క. కలయఁ గడివోయి యెందుం, జలితములై రాలె నాకసం బనుమ్రానం
గలపువ్వు లనఁగఁ దారక, ములు గానఁగరాక యడఁలిపోయెం దోడ్తోన్.163
తే. వెరవుతోడ వేఁకువ యనువెజ్జు తూర్పు, దిక్కుకెం పనుమంగునఁ దేర్చె నొక్కొ
తిమిరకాలాహివిషమూర్ఛనముల ననఁగఁ, దెలిసె నెత్తమ్ము లొప్పులు వలకొనంగ.164
క. గోవర్ధననిర్ఝరముల, పై వేమఱు సుడిసి గోపబర్హమయవతం
సావలి గదల్చుచును బృం, దావనపవనము మెలంగెఁ దద్వ్రజ మలరన్.165
చ. ప్రమదము లుల్లసిల్లఁ దనుసారఁగ నిద్రలువోయి పల్మఱుం
గమియ నెమర్చి మే నఱుగఁగాఁ బొరిఁ బెండలు పెట్టి లేచి వ
త్సములఁ దలంచి పంచితిలి చన్నులు చేపొదవంగఁ బెంపుతో
గొమరుగఁ జారుహుంకృతుల గోవులు చెన్ను వహించె మందలన్.166
తే. పసులలోనన యెరువుతిప్పలఁ బరుండి, మేలుకని యాలం బిదుకఁగ మెలఁగుగోష్ఠ
పతుల మెత్తనికడఁక ప్రభాతమునకుఁ, దానతొడవయి వ్రజమహోత్సవ మొనర్చె.167
సీ. కరమూలములజిగి గదలొత్తి వల్గత్కుచోపాంతకాంతుల నొత్తరింపఁ
దూగాడు హారపఙ్క్తుులదీప్తి వెలవెల్ల నగుదీపరుచులను నతకరింపఁ
జెదరుకుంతలముల నుదురుల నంటించి చెమట నెమ్మోములఁ జెలువు వెంప
మంథనధ్వనులకు మార్కొని కమనీయకంకణచలననిక్వణము లెసఁగఁ
తే. గౌను లురియంగఁ బిరుదులుఁ గదలి మేఖ, లావళులఁ గదలింప నేత్రాంశు లలరఁ
బెరువు ద్రచ్చుచు వేకువఁ బ్రేమమిగులఁ, బాడి రబ్జాక్షు గోపాలభామ లెలమి.168
క. కాళిందీసారసఘన, కోలాహల మద్రిధరునకును శుభయాత్రా
కాల మెఱిఁగించె సమ్మిళి, తాలోలరథాంగమిథునహర్షధ్వనులన్.169
వ. ఆంత.170
క. కంసాదిసురవిరోధి, ధ్వంసమునకుఁ బోవుకృష్ణు దర్శించుట కా
శంసఁ జనుదెంచె ననఁగా, హంసుఁడు ప్రాక్పర్వతంబునం దుదయించెన్.171