|
గోగణంబులం గొనుచుం జని యిమ్ముల నిలిచె నతనిమతం బెఱింగి మఱియునుం
గొందఱు గోపాలకు లచ్చోటిక యరిగి యరోగు లై రట్టియెడరునందు.
| 50
|
తే. |
ఏను జుట్టంపుజనులను నెందువోదు, మిచ్చటన యుండఁగా నేమి వచ్చెనేని
ననుభవింతుము గాకని చనక నిలిచె, నందగోపుఁడు దానును సుందరియును.
| 51
|
క. |
తల్లియుఁ దండ్రియు నిమ్మెయి, నిల్లు వెడల కధికరోగహృతచేతసులై
తల్లడిలుట విని కృష్ణుఁడు, పుల్లవడి [1]తలంకుచుండె బుద్ధిని నచటన్.
| 52
|
వ. |
ఇట్లు బలదేవకేశవులు బలిష్ఠు లయ్యు నయ్యుపద్రవప్రతికారంబునం దసమర్ధు లై
యుండ నా వ్రేపల్లె యందు విదేహదేశాగతుం డై యున్న గోపవృద్ధుం డొక్క
రుండు గోపముఖ్యుల నెల్లం గూడం బిలిచి వారితోడ.
| 53
|
సీ. |
పశుసమాశ్రయమున బ్రతుకుచున్నారము మనము దత్పశుసంఘమునకుఁ బ్రభుఁడు
వృషకేతనుం డగువిషకంఠుఁ డద్వయుఁ డటుగాన సద్భ క్తి నమ్మహాత్ము
నర్చింపఁగా శాంతి యగు నెల్లవిధముల వేదపారగు లైనవిప్రవరులు
బిలిపించి శాస్త్రసంభృతయుక్తికల్పితమార్గంబుతో దేవమందిరమునఁ
|
|
తే. |
దొడగుఁ డీయనుష్ఠానంబు జడత యుడిగి, యనినఁ గులవృద్ధుమాటకు నాత్మలందుఁ
దద్ద విశ్వాస మొలయంగఁ దత్క్షణంబ, గోపు లెల్ల ను దగువస్తుకోటి గూర్చి.
| 54
|
గోపాలకులు రోగశాంతికై శివపూజావ్రతంబు సలుపుట
వ. |
శివభక్తియుఁ దదీయతంత్రజ్ఞానంబును దదాచారధుర్యతయుం గల యార్య
ద్విజోత్తములఁ బ్రార్థించి తెచ్చి తత్క్రియా[2]నిర్వాహత్వంబునకు నియోగించిన
నమ్మహాత్ములు విహితోపవాసనియమసమాహితు లై తత్సమీపస్థితం బగుసిద్ధ
స్థానంబునందు.
| 55
|
తే. |
[3]ఎలమి ఋత్విక్కులను వరియించి కుండ, మండలోదారపూర్వకమహితతంత్ర
మతిశయిల్లఁగ ద్రవ్యంబులందు శుద్ది, వెలయ నధివాసనాదులు దొలుతఁ జేసి.
| 56
|
సీ. |
పంచామృతంబులఁ బంచగవ్యంబుల విమలోదకంబులఁ గ్రమముతోడ
నభిషేక మొనరించి యఖిలేశ్వరుని సమంచితగంధసమితి నర్చితునిఁ జేసి
భూరిసౌరభచారుఫుష్పదామంబులఁ బూజించి బహువిధస్ఫురితధూప
తతి యిచ్చి కపిలాఘృతప్లుతవర్తికారమ్యదీపముల నారతు లమర్చి
|
|
ఆ. |
భక్ష్యభోజ్యలేహ్యపానీయబహుళనై, వేద్యములు ఘటించి హృద్యలీలఁ
బగలు రేలు నట్లు పరిచర్య నడపుచుఁ, గొలిచి రేడుదివసములు గ్రమమున.
| 57
|
క. |
తగ నిప్పగిదిని దప్పక, నగజాస్కందులను వృష,భనందీశుల స
ర్వగణాధ్యక్షు వినాయకుఁ, బ్రగుణార్చనముల భజించి భావించి రెదన్.
| 58
|
తే. |
ఉత్తమం బగుశివమూర్తియుత్తమాంగ, మున నతిస్థూలఘృతధార లనవరతము
దొరుఁగుచుండెను మూఁడునధ్వరదినంబు, లన్నిటను విప్రవిహితప్రయత్ననిష్ఠ.
| 59
|
- ↑ వడంకు
- ↑ నిర్వాహకంబునను
- ↑ ఋత్విగాచార్యతతి. (పూ. ము.)