యశోదాదేవి శ్రీకృష్ణు నులూఖలబద్ధుని జేయుట
వ. |
ఇందు రమ్మని మెత్తనిజంకెతోడిబింకంబునం గొడుకుం గేలుపట్టి యొయ్యన తివిచి
కొనుచుం బోయి పెయ్యదామెనత్రాటం గొని శకటసమీపంబున బలితంబగు
రోల నుదరంబు బంధించి నున్నని సెలగోల చేతం గొని.
| 244
|
క. |
కదలిన మొత్తుదు నెక్కడఁ, గదలెద వటు గఱదులాఁడ కదలుమ యేఁ జూ
చెద ననుచుఁ బోయి యిమ్ముల, ముదిత నిజకుటుంబకార్యములఁ దత్పరయై.
| 243
|
సీ. |
ఉన్నంత నచ్యుతుం డుద్దామమగుతన సత్వంబు గోపాలజాతమునకు
నెఱిఁగింపఁ దలఁచి యొక్కింతసేపునకు నిజోదరంబున దామయుతనిబద్ధ
మగునులూఖలము రయమునఁ బెనంగ నాకర్షించుకొని మందగవని కెలని
జమిలిమద్దులలోన సంరంభమునఁ దగిలించి తాఁ దగులక లీల రెంటి
|
|
తే. |
నడుముగడచి నీల్గుటయును బుడమి వగులఁ, బెల్లగిలి కూలెఁ దరువులు గొల్లలెల్ల
గూడఁబడి రప్డు కొందఱు గోపసతులు, సూచి క్రమ్మనఁ బాఱి యశోదతోడ.
| 246
|
ఉ. |
ఎక్కడిబిడ్డ నీకు నిటు లెంతయుఁ గట్టిఁడ్ వేయుగంబులం
బొక్కెడుఱోటితో బలియుఁ బుత్రునిఁ ద్రాళులఁ గట్టునాఁడు వా
రక్కట గల్గ రట్లనఁగ నాఱడివోయెఁ గుమారుఁ డేపునన్
మిక్కుట మైనమ్రాకు లనె మీఁదఁబడ న్వడిఁ దాఁ బెనంగెడున్.
| 247
|
క. |
నేరుపుగల ననుచు నహం, కారంబున మిడిసిపడితి గ్రమ్మనఁ జని బం
గారముఁబోలెడు కొడుకున, కేరూపుననైనఁ బాపు మీసంకటమున్.
| 248
|
మ. |
అనినం దల్లడ మంది మేను విరియన్ హాయంచు గోపాలభా
మిని విస్రస్తములై పటాంచలము ధమ్మిల్లంబుఁ దూలంగ లో
చనపద్మంబుల బాష్పధార లెసఁగన్ సంభ్రాంతిఁ బాదద్వయం
బును దొట్రిల్లఁగఁ బాఱె గోపికలు నుద్భూతార్తలై తోఁ జనన్.
| 249
|
వ. |
నందగోపాదులు నటమున్న కదిసి రి ట్లరిగి యందఱు నున్మూలితయమళార్జున
మధ్యంబున మేఘద్వయమధ్యవిద్యోతి యగుశీతాంశుండునుంబోలె నాలోల
లోచనంబున సుధాసేచనరోచు లడర మందస్మితసుందరవదనమండలంబున నగ్రిమ
చూడామండనంబు వొలయం బొలుపారు కుమారునిం గని రంత నాగోపగ్రామణి
కొడుకుకడుపునం బెనఁచిన [1]క ట్టొయ్యన నూడ్చి యెత్తుకొని యిది యేమిచందం
బీబాలు నుదరంబు ఱోల ని ట్లేల కట్టి తింతద వ్వెట్టు లీడ్చె నిమ్మహీరుహంబు లెప్పగిది
గూలె నని తద్బంధననిమిత్తంబు నిజకళత్రంబువలన విని పుత్రుసత్త్వంబునకు
హర్షవిస్మయంబు లతిశయిల్ల నుండె గోపవృద్ధు లచ్చెరువునొంది తమలోన.
| 250
|
మ. |
అతివాతంబును వజ్రపాతమును హస్త్యాఘాతమున్ వాహినీ
వితతస్రోతము హేతువుల్ తరుతతి న్విభ్రంశ మొందింప న
|
|
- ↑ వన్నియు నొయ్య యూడ్చి