పుట:సకలనీతికథానిధానము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

సకలనీతికథానిధానము


క.

హరుఁడును హరియును నజుఁడును
శిరమున నురమునను వదనసీమల యందున్
దరుణులఁ దాల్చిరి పాయక
నరు లెంతటివారు పాయ నారీజనులన్.

15


వ.

అనిన మంత్రి యిట్లనియె.

16


ఆ.

అధికు లాచరించు విధములు దలపంగ
నితరజనులు సేయ నెట్లు గలరు
దంతిపల్లనంబు ధరియింపఁ బొట్టేలి
కలవియగునె చూఁడ నవనినాథ.

17


వ.

అనిన సతీవిరహితుండనై యుండ లే నేమి సేయుదు ననిన బహుశ్రుతుం డొక్కచిత్రపటంబున భానుమతి రూపంబు చిత్రించి ముందట నిడి యీపటంబు చూచుచుం గొలువుండి భూమిఁ బాలింపు మనిన నతం డట్ల సేయుచుండ నంత నొక్కనాఁడు.

18


తే.

శారదానందుఁడను గురుస్వామి యొక్క
యవసరంబున నృపుఁ జూడ నరుగుదెంచి
పటమునన్ లిఖత యైన యాభానుమతిని
గాంచి శోభనలక్షణక్రమము లరసి.

19


క.

విలిఖంచఁ డేలకో యీ
లలనామణి వామజఘనలాంఛన మనుచు
బలికిన భూపతి యితఁ డీ
నెల వెఱుఁగుట యెట్లు! తప్పె నిజమా సతికిన్.

20


వ.

అని మంత్రి జూచి శారదానందుని వధియించుమని పంపిన బహుశ్రుతుం డట్లగా యని శారదానందునిం గొని చని యొక్కభూగృహంబున డాఁచియుండె నంత నొక్కనాఁడు.

21