పుట:సకలనీతికథానిధానము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

67


ఆ.

నందభూమిపాలనందనుఁడు విజయ
పాలుఁడనెడువాడు పాదివేఁట[1]
యరుగదలఁచి సైంధవారోహణము చేసి
పురముగవని వెడలు దెరువునందు.

22


సీ.

యెండినతరువుననుండి కాకము గ్రోల్చె (?)
        వత్సకు నరచుచు వచ్చె గోవు
రజకుండు మలినవస్త్రపుమూటతో వచ్చె
        పట్టినఖడ్గంబు పడియెఁ బుడమి
చేలవిహీనయై బాలిక పొడచూపె
        తరుశాఖ విరిగి భూస్థలిని ద్రెళ్ళె
కుదిరలు వాపోయె కుడివంకదిక్కున
        ముందట గూకడె ముం..........


సవ్యబాహువు వణకెనశ్వంబు మ్రొగ్గె
కోట డెలిగించె బులుగుదాగుండ్ర తొలిపె
డబ్బు తొరజొచ్చి పరికె దబ్బిబ్బుగాఁగ
...............................

28


వ.

ఇవ్విధంబున నపశకునంబులైన మగుడ యారాజకుమారుండు మృగయావ్యసనపరాయణుండై చని యవ్వనంబున.

24


క.

మృగముల ౙంపుచు గోలము
దగులుచు వెనువెంటఁ దిరుగ తరణియు గ్రుంకెన్
ధిగధిగ నొకపులి తరిమిన
జగతీపతిసుతుఁడు తరువు సరసర బ్రాకెన్.

25


ఆ.

అట్లు మ్రాను వ్రాకి యగ్రశాఖకు జేర
నంతకపుడె ఋక్ష మందుమీద
నున్న కోహో యనుచునుండ భయంపడ
వలదటంచు నెలుగు వానిఁ బలికె.

26
  1. పెంపుడుపక్షులను విడిచి పట్టెడు వేఁట.