పుట:సకలనీతికథానిధానము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

సకలనీతికథానిధానము


క.

సారాచారసమగ్రో
దారుండగు నృపతిసుతుఁడు ధర పాలింపన్
మారీవ్యాధులు దరిద్రా[1] ?
చోరగ్రహగతులు ప్రజల సోకగయుండన్.

327


ఆ.

అట్లుగాన విక్రమార్కుఁడు రాజ్యంబు
పాలనంబు సేయ ప్రజల కెల్ల
దుష్టచోర రోగదుర్గత్య వగ్రహా
న్యాయవర్తనంబు లంటకుండు.

328


వ.

అనిన విక్రమార్కునకు ద్వాత్రింశత్పుత్రికాసింహాసనం బెట్లు గలిగె ననిన బలీంద్రునకు నారదుం డిట్లనియె.

329


క.

రంభయు నూర్వశియును ను
జృంభితనాట్యంబు చూప చింతారత్నా
దంభఘనవేదిపై నా
జనభారి వసించియున్నసమయమునందున్.

330


ఉత్సాహము.

ఏను బోయి మున్న జూచి యింద్రుడని యేవేడ్కనో
మౌనినాథ నృత్యశాస్త్రమార్గ మెవ్వఁ డెఱుఁగు నా
మానవేశుఁడైవ విక్రమార్కుఁ డెఱుఁగునన్న న
ద్దాన వారి రథము నంపె ధరణినాథుచోటికిన్.

331


ఉ.

పంపిన విక్రమార్క నరపాలకుఁ డింద్రునియాజ్ఞ పూని నై
లింప ధరిత్రి కేఁగి యట లేఖకులేంద్రుని గాంచి వజ్రి మ
న్నింపగ రత్నపీఠమున నిల్చె సురల్ వినుతింపగన్ యశ
స్సంపదుదారశౌర్యుడగు సాహసమూర్తి దిగీశవైఖరిన్.

332
  1. దుర్గతి