పుట:సకలనీతికథానిధానము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

57


క.

భరతాచార్య మతంబున
నొరవట్టగరాని నృత్య మూర్వశి చూపెన్
వరుసం దత్తిళమతమున
సరసముగా నాడె రంభ శక్రుఁడు చూడన్.

333


వ.

అప్పు డింద్రుఁడు విక్రమార్కుని జూచి యీయిద్దఱిలోన శాస్త్రసిద్ధం బైననృత్యం బెవ్వరి దనిన నతం డిట్లనియె.

334


క.

అంగములు ప్రధానంబులు
పాంగప్రత్యంగములు రసాస్పదభావం
బంగీకరింపవని యిది
సంగతి గాదనిరి భరతశాస్త్రజ్ఞవిధిజ్ఞుల్.

335


క.

అంగప్రత్యంగములే
అంగీకరణంబు గాఁగ నాడెనురంభా
భంగులు శాస్త్రక్రియలకు
భంగంబగు నండ్రు చూడు భరతవిధిజ్ఞుల్.

336


వ.

మఱియు శుద్ధాంగవిధాంగ దేశిమార్గ నృత్యంబుల నిపుణత చూపిన నూర్వశి మత్తల్లి హల్లీసక ప్రేక్షణి పేరణీ కుండలి దండలాసతాది నృత్యంబులు విధాంగలక్షణం బగుటను శుద్ధాంగవిధాంగంబులలో శుద్ధాంగం బుత్తమం బగుట నూర్వశి మేలనిన ద్వాత్రింశత్పుత్రికాయుక్తంబైన సింహాసనం బిచ్చి యనిపిన విక్రమార్కుడునుం బురంబునకు వచ్చి తత్సింహాసనారూఢుండై రాజ్యంబు సేయుచుండ గొంతకాలంబునకును.

337


ఆ.

కంప మొందె ధరణి గజముల మద మింకె
తురగనేత్రములను దొరగె నీరు
కురిసె రక్తవృష్టి కూపెట్టె నక్కలు
రవికి దేజ మణఁగె రాజె దిశలు.

338