పుట:సకలనీతికథానిధానము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

53


......................
        ........................
........................
        .........................


తే.

దేహ మస్థిర మనుచు సందేహ ముడిగి
యిత్తు రుత్తము లీరాని విత్తమైన
.................................
..................................

309


వ.

అని తలంచి కుహకవిప్రులకు నమృతకలశం బిచ్చి యప్పటి యట్ల తపంబున వాసుకి నారాధించి తత్ప్రసాదంబున నాత్మబలంబులు ప్రాణములు వడసి తనపురంబున కరిగి రాజ్యంబు చేయుచుండె మఱి యొకకథ వినుమని యిట్లనియె.

310


క.

దానంబును సాహసమును
మానవుఁ డేకొలది గట్టిమనసున జేయున్
దానాకొలదినె ఫలసం
తానంబులు గలుగు నిదియె తథ్యము సుమ్మీ.

311


వ.

అది యెట్లనిన.

312


సీ.

విక్రమార్కుడు రాజ్యవిభవస్థుఁడై యుండ
        కవి వచ్చి వితరణకథలలోన
కనకవర్ముండను మనుజేశ్వరుండను
        దినమును దేవికి తనువు వేల్చి
యర్థంబు వడసిధనార్థుల దనుపుచు
        వర్తించునని జెప్పి వాని జూడ
నరిగి యాతఁడు వేల్చుననలంబులో దన
        దేహంబు వైచిన దేవి మెచ్చి