పుట:సకలనీతికథానిధానము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

సకలనీతికథానిధానము


ఆ.

వరము వేడుమన్న వరదయ నృపతికి
ధరువు వేల్పకుండ ధనము లిమ్ము
అనిన నిచ్చె దేవి యతఁడును ముద మంది
యనుప విక్రమార్కుఁ డరిగెఁ బురికి.

313


వ.

మఱియు నొక్కవినోదంబు వినుమని యిట్లనియె.

314


క.

నేమములు దలచ నొల్లరు
సామాన్యం బనరు తమకు సాగిన కొలదిన్
కామిను లేకాంతంబున
కామించిన నొల్లమనరు కాముకజనముల్.

315


వ.

అది యెట్లనిన.

316


స్వాగతం.

శక్రసన్నిభుఁడు సాహసలీలా
విక్రముండు పృథివీతల మేలన్
శుక్రనీతిమతి శుద్ధుఁడు మంత్రీ
ప్రక్రముండు జనపాలకు వీఁటన్.

317


వ.

శుద్ధబుద్ధి యనువాడు తత్తనూభవుం డిచ్ఛావిహారుండనువాఁడు దుర్వర్తనుండై దేశంబు దిరుగుచు నుష్ణతీర్థంబున నుష్ణలింగంబు దర్శించి యారాత్రి యక్కడ వసియించియుండ నారాత్రియందు.

318


క.

శంభుని గొలువగ వచ్చిరి
రంభోర్వశలాదిగాగ రాజానన లు
జ్జృంభకుచకుంభసంభృత
శుంభద్గంధానుమోదశోభిత లగుచున్.

319