పుట:సకలనీతికథానిధానము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

సకలనీతికథానిధానము


వ.

అది యెట్లనిన.

264


సీ.

రత్నావతీపురీరమణుండు నరదత్తుఁ
        డనురాజు సుతుని జయంతు నొక్క
శూలనాసాపిశాచుఁడు సోకి యెటువంటి
        మంత్రతంత్రాదులు మానకున్న
భూపతి చింతించి భూతము నెవ్వండు
        విడిపించుఁ జాలంగ విత్త మిత్తు
నని పురి సాటింప నందు సాగరి యను
        వారకామిని ధనవాంఛఁ జేసి


తే.

మాన్పఁగా నేర్తుననుచుఁ గుమారి దెచ్చి
శూలనాసాశ్రయుని రాజసుతునియొద్ద
నునిచి పరిచర్య చేసెడియుక్తి గరపె
నదియు బరిచర్య సేయంగ నాపిశాచి.

265


క.

అక్కామిని కిట్లనియెన్
జిక్కితి నీమీఁది కూర్మిఁ జెలువా నాపై
మక్కువ సేయుము నావుఁడు
నక్కామిని యాత్మజనని కది యెఱగింపన్.

266


ఆ.

దానితల్లి వచ్చి తరుణి మాయింటికి
ననుపుమనిన భూత మనియె నీవు
చెప్పినట్టిపనులు చేసెద నిక్కాంత
నునుపుమనిన వారవనిత బలికె.

267


ఆ.

ఎఱ్ఱరాజనంబు లిరువదిపుట్లును
బియ్య మనుదినంబు బెట్టు తూము
దెత్తుననియు నీవుదెచ్చినతూమునఁ
గొలుతుననుచు నియ్యకోలు చేసి.

268