పుట:సకలనీతికథానిధానము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

175


క.

దైవవశంబునఁ గామిని
చావక యొకకొయ్య వట్టి చనఁగ ప్రభాతం
బావిర్భవింప గౌతమ
దేవమునీంద్రుండు దరికిఁ దెచ్చెను దానిన్.

258


తరల:

కమలలోచన యంతఁ బుత్రకు గాంచె నుజ్జ్వలమూర్తి శ్రీ
రమణతుల్యుని సార్వభౌముని రాజలక్షణు నిక్కడన్
రమణి యక్కుసుమావతియు బధిరాంధమూకవికారునిన్
శమవిహీనుని బుత్రు గాంచెను సమ్మదప్రతిపక్షునిన్.

259


వ.

అంత నప్పద్మాంకుండు దిగ్విజయార్ధం బరిగి గౌతమాశ్రమంబునం గుమారునిం జూచి వీఁ డెవ్వనిపుత్రుండని యమ్మునీశ్వరు నడిగిన నతం డిట్లనియె.

260


స్వాగతము:

సారసలోచన క్ష్మావర నీకున్
గారవ మొప్పగ గాంచిన పుత్రుం
డీరమణీయుఁ డహీనబలుండై
ధారుణియెల్ల నుదారత నేలున్.

261


వ.

అని వినిపించి తదీయాగమనక్రమం బెల్ల నెఱింగించినఁ గమలలోచనా సుతసహితుండై మునియనుజ్ఞ నాత్మపురంబున కేతెంచి యందుఁ గుసుమావతి వర్జించెనని తంత్రి దాదికి మఱియొక్కకథ వినుమని యిట్లనియె.

262


క.

సాహసునకు దైవంబును
సాహాయ్యము సేయు హీనసాహుసుఁ డైనం
ద్రోహియని దైవమును ద
త్సాహాయ్యము విడిచి వానిఁ జంపఁగ జూచున్.

263