పుట:సకలనీతికథానిధానము.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

సకలనీతికథానిధానము


సీ.

మాహిష్మతీపురి మహిపతి జలశాయి
        పద్మజుగురిచి తపంబు సేయ
నురగంబు పుత్రుగా నొసఁగి యాపుత్రున
        కశనంబుగాఁ గన్యకలను నొసంగు
మనిన నారాజన్యుఁ డటువలె నహిఁ గాంచి
        పురకన్యకలనెల్ల భుక్తి యొసఁగ
నొకనాఁడు పురినిఁ గన్యకలు లేకుండిన
        భైరవివరమున బ్రాహ్మణునకు


తే.

జననమొందిన కమలలోచనను మాఱుఁ
దల్లి వెలవుచ్చికొని యీయ దందశూక
భుక్తి కరుగుచు భైరవిపూజచేతఁ
గాంచినటువంటి పద్మయుగంబు గొనుచు.

254


క.

అరిగి, ఫణి, భుక్తి కొఱకై
యరుదేరఁగ ఱొమ్ము వేయ నప్పద్మహతిన్
నరుఁడై వరియించెను నజు
వరమును నిటువలెనె కాన వైభవ మొప్పన్.

255


తే.

అతఁడు పద్మాంకుఁ డనుపేర నతిశయిల్లె
పద్మలోచన యంత గర్భంబు దాల్ప
సవతి జనయిత్రి తనవ్యభిచారి కూఁతు
గర్భిణికి బుద్ధు లెల్లనుఁ గఱపి యంత.

256


వ.

కమలలోచనకు నోముమీఁద నభిలాష పుట్టించి కుసుమావతిం బద్మాంకునొద్ద నిలిపి యక్కమలలోచనం గొని యర్థరాత్రంబున గంగమడువునం ద్రోచుటయును.

257