పుట:సకలనీతికథానిధానము.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

177


వ.

ప్రతిరాత్రియు నటువలెఁ బెట్టుచు నట్లు గూడి సుఖియింపుచు నొక్కనాఁడు.

269


క.

ఎయ్యెడ నెఱ రాజనపున్
బియ్యంబులు దొరకకున్న భీతుం డగుచున్
సయ్యన నానృపసుతుపై
నెయ్యముఁ దిగవిడిచి యంధ్రనృపసుతుఁ బట్టెన్.

270


ఉ.

పట్టినఁ నంధ్రభూమి జనపాలుఁడు సాగుళిగొంచుబోవు(?)నా
పట్టియుఁ దాను దానవుఁడు పట్టినరాసుతుఁ జూడ భూతమున్
బట్టొకభంగి గావదలి భామిని కిట్లను తూముఁ దెచ్చితో
పెట్టిట వచ్చితోఁ యనిన పెట్టక తెచ్చితి నన్న భీతుఁడై.

271


క.

ఇది మొదలు గాఁగ మనుజుల
గదియను నీతూము నానకామినియని భూ
విదితముగఁ బలికె నృపసుతు
వదలడివికి(?) జనియె బురమువారలు నవ్వన్.

272


వ.

సాగుళికయు నభ్భూపాలునిచేత నధికధనంబులు వడసి సుఖం బుండెనని చెప్పిన నాజానుబాహుండను పిశాచం బిట్లనియె.

273


క.

మాటాడనేర్పు కలిగినఁ
బాటింతురు నృపులు దైవబాధ లడంగున్
బోటులు మనసిత్తురు దగ
మాటాడగ నేరవలయు మానవు లెపుడున్.

274


వ.

అది యెట్లనిన.

275


సీ.

పిప్పలుండను సెట్టి పృధివిపై సైంధవ
        వ్యవహారికంబున నరుగుచుండి
ప్రొద్దుఁ గ్రుంకుటయునుఁ బోలేక యడవిలో
        విడిసి చోరమృగాదు లడవి విడిచి