పుట:సకలనీతికథానిధానము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

109


వ.

అని కించిత్ప్రాణావశేషుండైన తస్కరుం డక్కన్య తల్లికిం గన్నుదనియధనంబు తననిక్షేపంబు నిచ్చి దానిఁ దా వరియించినవాఁడై యిట్లనియె.

264


ఆ.

సూర్యదీప్తిపురము చొచ్చి మత్సఖుఁడైన
యక్కుమారదత్తునాలయమున
నిలిచి యొక్కవిప్రువలన సంతానంబు
వడయు నాకు సుగతి ఫలము వొంద.

265


వ.

అని చోరుండు ప్రాణంబు విడిచె దల్లియుం గూఁతురు ధనంబు గైకొని తత్సఖుగృహంబునకు వచ్చియుండునంత నొక్కనాఁడు కూతుం జూచి విప్రునివలన సంతానంబు వడయుమనిన సమ్మతిలకున్న నిట్లనియె.

266


క.

వరుని యనుజ్ఞను వేఱొక
పురుషునియెడనైన వనిత పుత్రునిఁ బడయన్
బరమును దప్ప దిహంబును
బొరినిందయు రాదు వాఁడు పూజ్యం డగుటన్.

267


వ.

అని యొడంబరచుటయును.

268


క.

హేమస్వామి యనంగను
భూమీసురవరుని బొంది పుత్రునిఁ గని య
క్కామిని సిగ్గునఁ బెంపక
భూమిశారామవీథిఁబుత్రునిఁ బెట్టిన్.

269


క.

వనపాలకుచే విని య
జ్జనపతి తెప్పించి వాని సల్లక్షణముల్
కని తా నపుత్రుఁ డౌటనుఁ
తనయునిగాఁ బెంచి వాని ధరణిపుఁ జేసెన్.

270