పుట:సకలనీతికథానిధానము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

సకలనీతికథానిధానము


వ.

అంతఁ గొంతకాలంబున కారాజు మృతుండైన నక్కుమారుండు.

271


ఆ.

గయను పిండ మిడుచు గంగ నస్థులు నిల్ప
సుతున కిహముఁ బరము జూర యబ్బు
నతనిఁబుత్రుఁ డనుచు నందురు బుధు లట్లు
గానివాఁడు సుతుఁడు లేనివాఁడు.

272


వ.

అని తలఁచి గయకుం జని పిండప్రదానంబు సేయు నప్పుడు.

273


క.

హస్తములు పిండభుక్తికి
శస్తముగా మూడు దోచె జనపతిసుతుఁ డే
హస్తమున నిడుదునో యని
నిస్తరణము సేయలేక నివ్వెఱపడియెన్.

274


వ.

ఇందు నెవ్వరిహస్తంబునఁ బిండం బిడవలయుననిన విక్రమార్కుం డిట్లనియె.

275


ఆ.

పోషకుండు భూమిభుజుఁడు గూఢాచారి
విప్రుఁ డట్లు గాన వీరు గారు
ధనము పెవెట్టి కన్యఁ దస్కరుండు వరించె
దండ్రి యతఁడె పిండదానమునకు.

276


వ.

అనిన బేతాళుం డరిగి పరచినఁ బట్టి కట్టితెచ్చుచో నొక్కకథ వినుమని యిట్లనియె.

277


సీ.

చిత్రకూటం బేలు క్షితిపతి యొకనాఁడు
        వేఁటగాఁజని యటవీస్థలమున
గణ్వునకును మేనకకునుఁ జనించిన
        కన్యక నతడీయఁ గామి యగుచు