పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆనాడు ఆర్యసమాజీకులు శుద్ధి సంఘటనల ద్వారా, ముస్లింలు తబ్లిఖ్‌ సంస్థల ద్వారా చేస్తున్న మత మార్పిడులను అష్పాఖుల్లా నిరసించారు. మనదేశంలో మతం పేరిట జరుగుతున్నసంఘర్షణలు పాలక వర్గాల కుట్రలని హెచ్చరించారు. మత మార్పిడులకు పాల్పడుతున్న సంస్థలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆనాడు దేశంలో ఉన్న ఏడు కోట్ల ముస్లింలను హిందువులుగా, ఇరవైరెండు కోట్ల హిందువులను ముస్లింలుగా ఎవరైనా మార్చగలరా? అన్నారు. హిందూ-ముస్లిం మతమార్పిడిదారులను ప్రశ్నిస్తూ, ఆ ప్రయత్నాలను విరమించమని ఆయన కోరారు.

(He addressed the members of both the communities Hindus and Muslims and openly expressed his view that it is impossible that seven crores of Muslims be converted to Hinduism and equally impossible was the proposition that twenty two crores of Hindus be converted to Muslim faith ‘ - Great Revolutionary Martyr Ashfaqullah Khan, Dr.Omkar Nath Tripathi, Basha Sangam, Allahabad, 2001, Page.7)

బానిసలుగా బతుకుతున్న వారికి మతమేంటి? బానిసలు తమ ఇచ్చవచ్చిన రీతిలో తమ మతధర్మాలను పాటించగలరా ? మీరు మీ మతాన్ని సంస్కరించగలరా? అది సాధ్య మా ? అని అష్పాక్‌ ప్రజలను ప్రశ్నించారు. మతం కంటె స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రధానమని ఆయన ప్రకటించారు. బ్రిటిషర్ల బానిసయ్వం నుంచి బయటపడాలని, ప్రజలంతా మత విభేదాలను మరచి సమైక్యం కావాలని పిలుపునిచ్చారు. ఎవరి మత ధర్మాలను వారు ప్రశాంతంగా పాటించండి. అందరితో సవ్యంగా వ్యవహరించండి. అంతా కలసి శ్వేత భూతాన్ని మంత్రం లేక తంత్రంతో గద్దె దించి తరిమి కొట్టండి. ఈ భూతం దేశం వదలి వెడితే అంతా సవ్యంగా ఉంటుంది. మీరు ఈ విషయాన్ని ఆవలోకించండి. మీరు ముందు ఇండియాను విముక్తం చేయండి. ఆ తరువాత మిగతా విషయాలను ఆలోచించండి. దేవుడు ఎవరికి ఏమార్గం చూపుతాడో ఆతను ఆ మార్గంలో సాగుతారు. ఎవ్వరూ కూడాఆ దారుల నుండి మరెవ్వరినీ మళ్ళించ లేరు. మీరంతా ఐక్యం కండి. బలపడండి. లేనట్లయితే మన హిందూస్థాన్‌ యావత్తు నాశనమై పోగలదు, తస్మాత్‌ జాగ్రత్త అని ఆయన హిందూ-ముస్లిం జనసమూహాలకు పిలుపివ్వటంతో పాటుగా హెచ్చరికలు కూడాజారీ చేశారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Page.120)

32