పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దున్న పంచాశద్వర్ణంబుల నవలోకించుచుం దత్త దధిష్టానదేవ
తల నజపవిధానంబున నర్చించుచు నాడీ శోధనం బొనర్చి
క్రమంబుగ షడాధారంబులు భేదించి సుషుమ్ననాడీమార్గం
బున నూర్ధ్వముఖంబుగ గమనించి సహస్రార కమలాంతర్గత
సుధా బిందుపానానుభవంబునఁ బరవశులై చొక్కుచుండు
వారును, హృదయకమలకర్ణికామధ్యంబున నంగుష్ఠమాత్రుం
డై ప్రకాశించుచున్న పరమపుర్షుని ధ్యానించి తదనుభవం
బున నానందించువారును, సాంఖ్యతారకామనస్కయోగా
భ్యాసపరవశులై యంతర్లక్ష్య మధ్యలక్ష్యావలోకనంబులు
సేయువారును, శ్రోత్రనేత్రనాసాపుటనిరోధం బొనర్చి
యాత్మ ప్రత్యయ ప్రకారంబు వీక్షించుచు దశవిధనాదంబు
లాలకించువారును, మఱియు నంతర్లక్ష్యంబున నుండి యఱ
గంటి చూడ్కిని స్వరూపధ్యానంబు సేయువారును,
కన్నులు మూసి శిరంబు వంచి యూర్ధ్వజ్ఞప్తిఁ గళా
మాత్రంబు నిల్చువారును, ఇద మిత్థ మనుట మఱచి
యెఱుకమాత్రంబై శేషించి కేవ లాత్మానుభావంబు సేయు
వారును, స్థూలజిహ్వాగ్రంబును దదుపరి సూక్ష్మజిహ్వా
గ్రంబుఁ దాకునట్టుగాఁ జొన్పుచుం దదేకనిష్ఠచే లంబికా
యోగం బొనర్చువారును, ఇవ్విధంబున ధ్యాన షణ్ముఖీ
శాంభవీ రాధాయంత్రఖేచరీ ముద్రాభ్యాసపరులై యనేక
పాదస్థులై సవితృ మండల మధ్యవర్తియైన నారాయణ
విగ్రహంబును జూచువారును, పంచాగ్ని మధ్యంబునందుఁ
గూర్చుండి మహాఘోర తపంబు సేయువారును, నృసిం
హానుష్ఠభంబును, రామతారకంబును, గోపాలమంత్రం