పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

85


బును, వరాహమంత్రంబును, వాసుదేవ ద్వాదశాక్షరం
బును, నారాయణాష్టాక్షరంబును, శుద్ధప్రణవ మంత్రం
బును, బ్రశస్తసప్తకోటి మహామంత్రంబుల న్యాస ధ్యాన
పూర్వకంబులుగ నేకాగ్రచిత్తంబున జపంబులు సేయు
వారును, శ్రీమన్నారాయణ విగ్రహంబును బూజించుచుం
దన్మంత్రపారాయణులై యుండువారును, వ్యాఘ్రకృష్ణా
జినవల్కలాంబరులై వాతాంబు పర్ణకందమూల ఫలా
హారులై కర్మ జ్ఞాన భక్తి వైరాగ్య జప తప హోమాది
సకల సత్కర్మ నిష్ఠల నుండు మహామునిజన సమూహ
మధ్యంబున.

40


సీ.

అలఘుచతుర్భాహువులు చతుర్ముఖములు
        నెనిమిది కన్నులు ననలసదృశ
తనువు దీపింపఁగ ధ్యానయోగసునిష్ఠ
        నూని పద్మాసనాసీనుఁ డగుచు
ననుపమనారాయణాష్టాక్షరీ జప
        కలితుఁడై నాసికాగ్రమున దృష్టి
హత్తించి స్ఫటిక సదక్షమాలికఁ జేతఁ
        బట్టి చిత్తము బిగఁబట్టి చక్ర


తే.

పాణిపదములయం దుంచి పరమభక్తి
చే భరన్యాస యోగసంసిద్ధుఁ డగుచు
వనజసంభవుఁ డుండఁగాఁ గని వసిష్ఠ
సంయమీంద్రుఁడు విస్మయంబంది యపుడు.

41


తే.

దశరథేశ్వర యిమ్మహా తాపసులను
గూడి పద్మజుఁ డిచట నెక్కున తపంబు