పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

83


వ.

మఱియు నీ కీదినంబున నభిజిల్లగ్నంబునందుఁ బ్రయాణంబు
నకు శుభంబుగ నున్నయది యనిన నవ్వసిష్ఠుని నాశీర్వచ
నంబు నొంది ప్రయాణంబై, గోదావరీకృష్ణాఘహారీప్రముఖ
నదులందుం గ్రుంకుచు వచ్చుచు ముందట శ్రీ వేంకటా
చలంబుం గని మ్రొక్కి యారోహించి తద్గిరిగహ్వర సాను
దేశప్రముఖ సిద్ధస్థలంబుల నీక్షించుచు వచ్చి యనంతరంబు.

38


సీ.

పద్మనీలోత్పలప్రముఖాంబుజశ్రేణు
        లందుఁ దుమ్మెద లింపుఁ జెంది పాడ
వనజనాళంబులు ఘనమరాళంబుల
        తుండంబులం దంటి తూలి యాడ
మత్స్య కచ్ఛప తతి మసల కాహారార్థ
        ముగ నీట నీఁదెడు వగలు మెఱయఁ
దఱలు తరంగము ల్దగి పైని మారుతం
        బల్లన వీవంగ నలరునట్టి


తే.

స్వామిపుష్కరిణిం గని సంతసించి
దశరథుం డప్పు డాతీర్థతటము సేరి
యచ్చ టచ్చట యోగంబులందు నుండు
మునులఁ గన్గొని వారికి మ్రొక్కి నిలచి.

39


వ.

మఱియు నత్తీరంబున ననేకజటాధారులును, సిద్ధాసన భద్రా
సన గోముఖాసన స్వస్తికాసన పద్మాసన దర్భకాసన కుర్కు
టాసన అర్భకాసన ప్రముఖాసనాసీనులై రేచక పూరక
కుంభక యుక్తప్రాణాయామంబులు సేయువారును, ఆధార
స్వాధిష్ఠానమణిపూర కానాహత విశుద్ధాజ్ఞాచక్రంబులయం