పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నాదశకంఠుమాయలు గావు భావింప
        హరిమాయ గావలె ననెడువారు
నీసంశయము దీర నీమాటు గుహలోని
        కరిగి క్రమ్మఱఁ జూత మనెడువారు


తే.

మనము మాత్రము పోరాదు మర్కటముల
నన్నిటిని గూడి పోవచ్చు ననెడువారు
నపుడు కలగంటి మిది దబ్బ రనెడువారు
ననృత మేలగు నిజ మిది యనెడువారు.

239


వ.

ఇవ్విధంబున నందఱు సందేహములు పడుచు మరల నాగు
హను జూడంగఁ బోవ నది కన్పట్టకుండుటం జేసి యందందుం
గలగుహ లన్నియు వెదకి గానక రామచంద్రునికడకు
వచ్చి గుహవృత్తాంతం బంతయు నెఱింగింప నక్కరుణాసము
ద్రుండు చిఱునగవు మోమున మొలకలెత్త నిట్లనియె.

240


సీ.

దేవర్షి రాజనదీమూలములు పరీ
        క్షించి నిర్ణయముగఁ జెప్పరాదు
మహిమాఢ్యుఁ డైనరమామనోహరుఁ డిందు
        నలరు రీతిని కల్ల యనఁగరాదు
హరిగిరిమహిమ లా హరి యెఱుంగును గాని
        దేవతలకుఁ గూడఁ దెలియఁబడదు
యీయద్రిమహిమల నెంచ కేరితరంబు
        మించి పరీక్షింప మీకుఁ దగదు


తే.

మంచి దైనను గొదవేమి మాధవుండు
కరుణతో మీకు దర్శనం బరయ నిచ్చె