పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

69


ధన్యు లైతిరి పాపము ల్తలఁగె నంచు
నాడి శ్రీరాముఁ డాదినం బచటనుండె.

241


సరవిగ మఱునాఁ డద్రిని
హరిబలములతోడ డిగ్గి యారఘురాముం
డరి గెలువం జని యంబుధి
గిరు లిడి బంధించి మించి కీర్తియెసంగన్.

242

క.

చ.

కపులును దమ్ముఁడుం గొలువఁగా నొగి లంకకుఁ బోయియచ్చటన్
విపులబలంబుతో నసురవీరుల నెల్ల వధించి ధీరతం
గుపితుని గుంభకర్లు ధరఁ గూలిచి రావణుతోడఁ బోరి యా
రిపుని వధించె దేవమునిబృందము మెచ్చఁగ రాముఁ డెంతయున్.

243


సీ.

సీత నచ్చటఁ బరీక్షించి శ్రీరాముడు
        గూడి విభీషణుఁ గూర్మి కలరి
యాలంక కాతని నధిపునిగాఁ జేసి
        జానకీలక్ష్మణసహితుఁ డగుచు
వానరచయముతో వరపుష్పకం బెక్కి
        సాకేతపురి సంతసమునఁ జేరి
భరతశత్రుఘ్నులు భక్తిమైఁ గొలువంగఁ
        బట్టాభిషిక్తుఁడై ప్రజలనెల్లఁ


తే.

బ్రథిత దయఁబూని పాలింపఁ బృథివి తఱిని
పండుచుండెను సస్యంబు మెండుగాను
మౌనివర్యుల కీరితిఁ బూని చెప్ప
విని ముదంబంది గుహలోనఁ దనరినట్టి.

244


వ.

పరమపురుషుం డెవం డాయద్రిమహిమ ససాకల్యంబుగ
వచింపు మనిన మునులకు సూతుం డిట్లనియె.

245