పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

67


శంఖచక్రగదాబ్జసహితహస్తుండు మ
        హాత్ముండు పూర్ణచంద్రాననుండు
సురుచిరసుందరసుకుమారదేహుండు
        విమలసత్కారుణ్యవీక్షణుండు


తే.

నగుచు ఘనభోగిభోగపర్యంకమునను
వాసి మీఱఁగఁ గూర్చుండి వామపదము
ముడిచికొని కుడిపాదంబు పుడమిమీఁద
నింపుగాఁ జూచుచుండు లక్ష్మీశ్వరుండు.

236


క.

కరములు రెం డా ఫణిపై
నిరవుగ నూనుకొని లక్ష్మి యెదపై వెలుఁగన్
ధరణియు నీళయు భక్తిని
నిరుగెడ వసియించి వేడ్క నెసలారంగన్.

237


వ.

ఇవ్విధంబున సుఖాసీనుఁ డైయుండు పురుషోత్తమునకుం
గరుడసుందరీమణులు చామరంబులు వీవ మఱికొందఱు
శ్వేతచ్ఛత్రంబులు పట్టఁ గోటిసూర్యప్రభాభాసితుం డై
వెలుంగుశ్రీహరిని సంతోషమగ్నులై చూచుచున్నకపుల
నీక్షించి యం దొకవేత్రహస్తుండు మార్గంబు చూప నక్కపు
లామార్గంబున నీవలకు వచ్చి యాశ్చర్యంబు నొంది తమలోఁ
దా మిట్లు తలంచుకొనిరి.

238


సీ.

శ్రీరామచంద్రుని చెలఁగి గెల్వఁగలేక
        రావణుండు గుహాంతరాళమునను
జేరి రాక్షసమాయ లీరీతిగాఁ జూపె
        నని తోఁచు చున్నది యనెడువారు