పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ్యాపించెం ద్రిజగంబులందు సుకృతవ్యామోహ మై శ్రేయమై.

189


వ.

ఆలింగంబు నిర్జరప్రకరంబులచేతను సజ్జనంబులచేతం బూజఁ
గొనంబడిన కారణంబునఁ గపిలలింగంబని ప్రసిద్ధంబయ్యె.

190


ఆ.

సగరనందనులకు సద్గతి నొసంగి యం
దున్న భోగవతి మహోన్నతముగ
వేగ లింగమూర్తి వెంటనే ధాత్రి భే
దించి వచ్చి కపిలతీర్థ మనఁగ.

191


క.

ప్రవహించి సకలజనముల
భవతాప మడంచి లోకపావని యయ్యెన్
భువి నాఁటఁ గోలె భక్తిఁగ
నవగాహముసేయుచుందు రమరులు మనుజుల్.

192


సీ.

కపిలతీర్థమునఁ జక్కగఁ జక్రతీర్థంబు
        ప్రవహించు మును దేవపతి యహల్య
నెంచిన యఘము పీడించుటంజేసి యా
        జలమున స్నానంబు సల్పె మఱియుఁ
దదుపరిభాగానఁ దనరు విష్వక్సేన
        తీర్థంబు సుకృతవృద్ధియు నెసంగి
ప్రవహించుచుండు పూర్వము వరుణాత్మజుం
        డైనవిష్వక్సేనుఁ డచటఁ దపము


తే.

సలుపఁగా మెచ్చి హరి వచ్చి శంఖచక్ర
యుగళ మపుడిచ్చి పరివారయూథములకు
గర్తగాఁ జేసినందున క్ష్మాతలమున
నతనిపే రన నాతీర్థ మలరుచుండు.

193