పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

55


క.

పంచాయుధతీర్థములు స
మంచితముగ దానిపైని నలరారును దీ
పించు ఘనానలతీర్థము
మించి తదూర్ధ్వంబునందు మేలిడ నద్రిన్.

194


ఆ.

పరఁగ దాని కుపరి బ్రహ్మతీర్థము మహా
పాతకము లడంచి ప్రజల కెల్లఁ
బుణ్యఫల మొసంగు పొసఁగ నద్దానిపై
మునుల తీర్థములును దనరు నేడు.

195


ఆ.

ఒండుకంటె నొండు నిం డుత్తమఫలంబు
తీర్థములకు మహిమ తేజరిల్లు
నింత నొప్పుచుండు నెఱిఁగి బ్రహ్మాదులు
చెప్పలేరు నేను జెప్పఁగలనె?

196


క.

సరవిగ నింకొకచరితం
బరుదుగఁ జెప్పెదను దొల్లి యవనీసురుఁ డొ
క్కరుఁ డెలమిఁ దీర్థములఁ దా
వరుసఁగ జూడంగ నెంచి వచ్చుచు నుండన్.

197


సీ.

మార్గాన నొకతియ్యమావిచె ట్టండకుఁ
        జేరి తచ్చాయను దారిశ్రమము
వాయంగ నిద్రింప స్వప్నములో హరి
        వచ్చి యిట్లనె విప్రవర్య వినుము
అదె చూడు మీపుష్కరాద్రిసమీపము
        నందు దా నభయప్రదాఘచయము
వాసెడు తీర్థాలు పదియేడు గల వందు
        స్నానం బొనర్చినచో నిజముగ