పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

53


యిపు డానతిచ్చిన యీశ్వరుఁ డిందుండి
        యెటువోయె మఱి యాతఁ డీశ్వరుండొ
కాఁడొ నేఁ జూచుట కల్లయో నిక్కమో
        గలఁగంటినో యని కలవరమునఁ


తే.

గొంతసే పుండి యవల సద్గురునికృపను
హరి వరము లిచ్చినది నిక్కమంచుఁ దలఁచి
నమ్మి గిరి డిగ్గి తనమందిరమ్ము సేరి
సిరుల నొప్పుచు దానము ల్సేయుచుండె.

185


క.

ఈకథ పూర్వము శ్రీవా
ల్మీకిమునీంద్రుండు పోడిమిం జెప్పె నొగిన్
శ్రీకర మగు వినుమని నే
నాకైవడి మీకుఁ జెప్పితిని ముద మొప్పన్.

186


చ.

అనిన వరాహపర్వతమహత్త్వము చక్కఁగ నీవు దెల్పఁగా
వినుటకు మాకు నెల్లరకు వేఁడుక పుట్టెనుగాన మానసం
బుననొకయింతకోపమును బొందక చెప్పుమటంచుమౌను ల
త్యనఘుని సూతుఁ జూచి యనిరందఱు ప్రీతియెసంగ వెండియున్.

187


వ.

అనిరి సూతా! యమ్మహాగిరియందుఁ బదియేడు తీర్థంబు లున్న
వని చెప్పితి వయ్యవి వరుసగ విశదీకరింపవలయు ననిన
నమ్మునులం జూచి సూతుండు హరితేజోవిరాజమానుం డగు
కర్దమమునికి సుతుం డగుకపిలుండు తొల్లి.

188


శా.

ఆపాతాళమునందు సౌఖ్యవరయోగాభ్యాసముం జేయుచుం
జాపల్యంబు నడంచి నిర్మలమహోత్సాహంబుతో లింగమున్
శ్రీ పెంపొందఁగ నిల్పి యర్చనము తాఁ జేయంగ నాలింగమున్