పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

45


వ.

మఱియు నప్పావనపర్వతంబు మహాపన్నులకుఁ గామధేనువు
చందంబున నత్యంత శోకార్తులకుఁ గల్పవృక్షంబు కైవడిఁ
జింతితార్థంబు లిచ్చుచుఁ జింతామణి నామంబునం బ్రకాశించు
నందు నిర్హేతుకజాయమానకటాక్షవీక్షణుం డై సకలజనార్తి
నివారకుండై మనోభీష్టదాయకుండై శ్రీహరి సంపూర్ణకళా
న్వితుం డగుచు నిరంతరానందనిలయనివాసుఁ డై యుండు
నందు శ్రీస్వామిపుష్కరిణి సకలాఘనిచయనివారిణియై
యుండు తత్పశ్చిమతటంబున వాల్మీకిమునిభూధరంబుండు
నందు నిల్చి మూడుకాలంబుల నాపుష్కరిణి శుభోదకంబునం
గ్రుంకులిడి షణ్మాసంబులు విజితేంద్రియుండవై శ్రీమద్వేం
కటనాథుని విధివిహితంబుగ పోడశోపచారపూజలు సమర్పించు
చుండు మనంతర మాస్వామి కరుణార్ద్రహృదయుండై
ప్రసన్నంబయి నీయభీష్టం బొసంగునని పల్కుచుండు నశరీర
వాక్కులు విని సంతోషాయత్తచిత్తుండై యా వేంకటాచలా
రోహణంబు చేయుచు వివిధఫలపుష్పతరులతాశోభితంబును
నానావనచర చమరీ భల్లూక సారంగాది మృగావాసంబును
శుక కలకంఠ మయూరవిహంగాదిమనోహరకూజితకలితంబును
నవరత్నమయతపనీయప్రకాశితంబగు సానుప్రదేశంబులును
నగువేంకటాద్రి నెక్కి తన్మధ్యంబునఁ బావనపరిమళోదక
పూర్ణంబును కమలకల్హారనీలోత్పలకైరవకుసుమోపేతంబును
నిరంతరసంగీతసంకాశభృంగసందోహఝంకారమనోజ్ఞంబును
కమఠమీనగ్రాహప్రముఖసంకులంబును నగు స్వామిపుష్క
రిణి సందర్శనంబుచేసి తత్తీర్థంబున ననుపమభక్తి సంకల్పపూర్వ
కంబుగ స్నానంబొనర్చి యశరీరవాణిపల్కినయట్ల షణ్మాసం