పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యట రామసేతువునందుఁ గ్రుంకి మఱందు
        ముదమునఁ గొన్నాళ్లు వదలకుండి
వచ్పుచు మార్గాన వరశంఖమునిగిరి
        పై నుండి వచ్చెడు బావన మగు
శ్రీసువర్ణముఖరిఁ జెలఁగి స్నానము జేసి
        దాని కుత్తరముగఁ దరలి వచ్చి
దానవాంతకగిరి దరినుండు జంబుజం
        బీరగాలనచిరిబిల్వవకుళ
పాదపచయముచేఁ బరిశోభితం బగు
        భూమియం దొక్కెడఁ బొదలుచుండు


తే.

కమలకల్హారపుండరీకాదిపుష్ప
శోభితం బగుసరసిలో సుఖముగాను
స్నానమును జేసి యాతీరసాలమూల
మునఁ దగంజేరి యివ్విధంబునఁ దలంచె.

157


చ.

కటకట శాత్రపు ల్గినిసి కయ్య మొనర్చి మదీయమండలం
బటువలె నాక్రమించి రిపుడన్నము వస్త్రము గల్గుటెట్లు నే
నెటువలె నోర్తు కష్టమున కీశ్వరుఁ డీగతి చేసె నింక మీఁ
దటిగతి యేమటంచుఁ బరితాపముతో విపులార్తిఁబొందుచున్.

158


వ.

దేవుని మనంబున నెంచుచు దేహంబు పరవశత్వంబు నొందుటం
జేసీ యాసమయంబున నశరీరవాణి యిట్లనియె.

159


తే.

నిర్మలాత్ముఁడ మదియందు నీవు ధైర్య
మొందు చింతంప కిచటికి నుత్తరముగఁ
గ్రోశదూరాన వేంకటకుధరమున్న
దటకు నరుగుము భక్తితో నార్తి తొలఁగు.

160