పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

489


సీ.

పుట్టి గిట్టుచునున్న భూలోకవాసుల
        రక్షించుటకు రమారమణితోడ
వేంకటాచలమందు విఖ్యాతిగానుండి
        నరులచే గోవిందనామభజన
మొనరఁ జేయింపుచు ఘనపాపములనైన
        క్షీణింపఁజేయుచు సిరుల నిచ్చి
పాలింపుచున్నట్టి ఫణిగిరీశ్వరున కా
        వ్యూహమహాలక్ష్మి కుర్విమీఁద


తే.

వెలయు నావీరలక్ష్మి దా విమలహృదయ
యగుచు నలమేలుమంగాఖ్య నవనియందు
నమరెఁ బద్మావతికి వెంకటాద్రి కిలను
వెలయు శుభమంగళము మహావిభవముగను.

248


తే.

అప్పు డామునులెల్లఁ దథా స్తటంచుఁ
బలికి శ్రీవేంకటేశ్వరు భక్తికథలు
సూతుఁ డెఱిగింప వినుచు మెచ్చుచును వార
లంద ఱందుండి రానంద మతిశయింప.

249


క.

ధరణీశ్రీనీళాధిప
కరుణారసపూరితాత్మ కామితఫలదా
వరవేంకటగిరినాయక
తఱికుండనృసింహసుచరితా జగదీశా.

250


మాలిని.

సులలితమణిభూషా సూరిచిత్తాబ్జపూషా
కలుషజలధిశోషా కంజగర్భాండవేషా
కలిపురుషజదోషాక్రాంతజీవాళిపోషా
విలసితమృదుభాషా వేదవిద్యాప్రపోషా.

251