పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

488

శ్రీవేంకటాచలమాహాత్యము


ధ్రువమండలంబడ్డ దూలంబుకైవడి
        నుయ్యెలచేర్లతో నొలయఁగాను


తే.

పరమపదకాంతు లుప్పొంగి పద్మరాగ
ముఖ్యమణిజాలములరీతి ముద్దుగుల్కు
చెండ్లవలెఁ జూడ్కి కెదురుగఁ జెలఁగ దానిఁ
జూచుచును బాలుఁడాత్మలోఁ జొక్కుచుండ.

243


ఆ.

బాలకుండు దానిఁ బట్ట నుద్యుక్తుఁడై
ముఱిసి ముఱిసి కరము మొనసి సాఁచి
పట్టికొనుదుననుచు నట్టిట్టు జుణుఁగుచు
నుబ్బి బాల్యలీల నొప్పుచుండు.

244


క.

ఘనపద్మజాండకోటులఁ
దనసూక్ష్మోదరమునందు దాఁచి యెలమితో
వనరాశిమీఁదఁ దేలుచు
నొనరఁగ డోలోత్సవంబు నొంది సుఖించున్.

245


క.

వనజనిభాకారుండై
వననిధిలోఁ దేలుచున్న వటపత్రముపైఁ
దనుదాన చూచి చొక్కుచు
నెనవుగ నానందయోగనిద్రం జెందున్.

246


వ.

ఇవ్విధంబున యోగనిద్రం జెందియుండి పెద్దకాలంబునకుఁ
గ్రమ్మఱ మేల్కాంచి నిజగర్భగతప్రపంచంబును వెడలి పూర్వ
ప్రకారంబున నిర్మించునప్పుడు ముక్తజీవులు దక్క దక్కిన
కర్మజీవులు యథాప్రకారంబుగఁ బుట్టి గిట్టుచుందురని చెప్పి
వెండియు సూతుం డిట్లనియె.

247