పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

490

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


గద్యము.

ఇది శ్రీతఱికుండ లక్ష్మీనృసింహకరుణాకటాక్షకలిత
విచిత్ర వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్య తనూభవ వేంక
మాంబాప్రణీతం బైన శ్రీవీరలక్ష్మీవిలాసంబును, వేంక టేశ్వర
మాహాత్మ్యంబునందు లక్ష్మికొఱకు హరి కొల్లాపురంబునఁ
దపంబు సేయుటయు, శుకాశ్రమంబునం దపంబు సేయుమని
చక్రి కశరీరవాణి బోధించుటయును, శ్రీస్వామి పద్మసరో
వరతీరంబునం జేరి దివాకరప్రతిష్ఠ చేసి లక్ష్మిం గూర్చి తపంబు
సేయుటయు, దత్తపోవిఘ్నంబు సేయుటకు నింద్రానుమతం
బున రంభాదులు వచ్చి హరిని జలింపఁజేయనేరక యోడి సను
టయు, హరిం దలంచి పద్మావతి చింతనొందుటయు, లక్ష్మీకపిల
మునిసంవాదంబును, వ్యూహలక్ష్మి హరికిఁ బ్రసన్నం బగు
టయు, రమాసహితుఁడై బ్రహ్మాదులతోఁ జక్రి శేషాద్రి చేరు
టయు, లక్ష్మీనారాయణులు వినోదంబున సంభాషించుటయు,
శుకమార్తాండసంవాదంబును, ఛాయాశుకోత్పత్తియు, వీర
లక్ష్మి శుకాశ్రమంబు చేరియుండుటయు, బలకృష్ణసంవాదం
బును, శ్రీనివాసుని బ్రహ్మాదులర్చించిన కాలక్రమంబును,
కాలనిర్ణయంబును, అష్టాదశపురాణవిభజనయుఁ, బుణ్య
జీవులు వొందుసద్గతిక్రమంబును ననుకథలుగల శ్రీవేంకటా
చలమాహాత్మ్యంబునందు సర్వంబును షష్ఠాశ్వాసము.


శ్రీవేంకటాచలమాహాత్మ్యము
సంపూర్ణము.

చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
'వావిళ్ల ' ప్రెస్సున ముద్రితము -1937