సహస్రశీర్షుం డగు విరాట్పుర్షు నతిక్రమించి యమృతవెల్లి
యననొప్పు విరజానదియందుఁ గ్రుంకులిడి లింగదేహంబులను
విడిచి యప్రాకృతదివ్యదేహధరులై శతసహస్రదివ్యావరణా
మృతంబై యనేకకోటిసూర్యచంద్రప్రకాశమై యొప్పు
చున్న పరమపదమందుఁ బ్రకాశింపుచున్న నారాయణ పర
బ్రహ్మ సాన్నిధ్యంబును బొందుదురు. మఱియు భక్తిజ్ఞాన
వైరాగ్యంబుల నభ్యసించుచు నధ్యాత్మవిద్యానుభవులగు
నాత్మవేత్తలు స్వరూపవిలక్షణంబు లేక నిరాకారప్రకాశ
మైన కైవల్యపదమందుఁ బొందుదురు విజ్ఞానంబ పరబ్రహ్మం
బని యనుభవసిద్ధులగు జ్ఞానవేత్త లమృతసముద్రంబును
విరజయుం బొందుదురు. సహస్రశీర్షుండైన విరాట్పుర్షుండ
పరబ్రహ్మంబని నిశ్చయించి తద్ధ్యానారూఢులగువా రా
విరాట్పుర్షుని శీర్షోపరిప్రదేశంబునందుఁ జేరుచురు. వీరంద
ఱును బునరావృత్తిరహితులై యుందురు. మఱియు నవ్విరా
ట్పుర్షుని భ్రూమధ్యాధఃప్రదేశంబునందుఁ ద్రిగుణమిశ్రంబై
యున్న మూలప్రకృతిని పరతత్త్వంబని తదనుష్టానమంత్ర
సిద్ధులైనవారు దుర్గధామంబు నొందుదురు. తత్ప్రకృతి
జన్యంబులైన మహదాది సప్తావరణంబులను బరతత్త్వంబుగఁ
జూచువార లయ్యావరణంబులందుఁ బొందుదురు. వాసుదేవ
ద్వాదశాక్షరీ నారాయణాష్టాక్షరీ నారసింహ గోపాలాది