పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

483


కనుగవ మోడ్చుచు నావె
న్నుని ధ్యానము చేసి యొగి ననూనతబుద్ధిన్.

235


సీ.

సూతుఁ డిట్లనియె నో సూరిజనములార
        వివిధశ్రుతిస్మృతుల్ వినిన మీకు
నఖిలంబు దెలియు నాయందు సత్కృప నుంచి
        యతిరహస్యప్రశ్న యడిగినపుడు
చెప్పలే దన నేల చెప్పెదఁ దప్పొప్పు
        లంగీకరించి నెయ్యమున వినుఁడు
పాపకర్ములువోయి బహునారకములందుఁ
        బడి పుట్టుచుందురు ప్రజ్ఞ లేక


తే.

పుణ్యకర్ములు వోయి తత్పుణ్యఫలము
లనుభవించినతుద భూమియందు వ్రాలి
క్రమ్మఱం బుట్టుచుందురు కామముఖ్య
శత్రువుల గెల్చి గురుకటాక్షమును బొంది
నట్టివారు జనింప నీయవని మీఁద.

236


సీ.

అట్టివా రెవరన్న నాచార్యభక్తులై
        పరమవిరక్తులై పటువివేక
కలితులై శాంతులై గర్వవిదూరులై
        హేయకామాదులఁ బాయఁద్రోచి
గురుతరకల్యాణగుణులై యచంచల
        చిత్తులై విజ్ఞానసిద్ధు లగుచు
హెచ్చక తగ్గక యేకాంతనిష్ఠులై
        నారాయణధ్యానపూరితాత్ము