పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

477


నవి నఱువదినాల్గువే లబ్దముల్ గాక
        నిల్చిన యేండ్లు గణింప సరవిఁ


తే.

గుదిరి యిర్వదితొమ్మిదికోట్లపదియు
మూఁడులక్షలు నదిగాక మొనసి పైన
నేను బదియు నాలుగగువేల నెన్నఁ గూర్చి
భాగములఁ చేసి చూడఁ జొప్పడు నెసంగి.

214


తే.

ఇన్ని ముప్పదికోటులు నెనుబదియును
నాల్గులక్షలు నదిగాక నలువదెనిమి
దైనవేలేండ్లకును బాగు సరసి కూర్ప
నందు బహుధాన్యవత్సరం బాదిగాగ.

215


వ.

అఱువదియెనిమిది చతుర్యుగంబులయింటి కప్పటి కీశ్వర
నామాబ్దంబువఱకు జతుర్యుగ మొక్కింటికి సంవత్సరాలు
నలువదిమూఁడులక్ష లిరువదివేల లెక్కను మహాయుగంబులు
మున్ను చెప్పిన క్రమంబుగ నఱువదెనిమిదింటికి సంవత్సరము
లిరువది తొమ్మిదికోట్లు ముప్పదియేండ్ల లక్షలఱువదివేలును
వైఖానససూత్రక్రమముగ విఖనసబ్రహ్మకు శిష్యుడైన పుల్ల
మహామునికి శిష్యులైన యక్షు లర్చించి రందు.

216


సీ.

నయమగు బహుధాన్యనామసంవత్సరం
        బాదిగ వైఖానసాగమోక్త
పద్ధతిన్ విఖనసబ్రహ్మసంతతివార
        లటకోటి నలువదియాఱులక్ష
లెనుబదియును మఱి యెనిమిదివేలేండ్లు
        చిరభక్తులై పూజ చేసి రవల